టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు సమంత. దశాబ్ద కాలం నుండి టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడికి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కేవలం అందాల ఆరబోతకే పరిమితం కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది. ఏ మాయ చేశావే చిత్రంతో ప్రేక్షకులని అలరించిన సమంత ఆ సినిమా షూటింగ్ సమయంలో నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఇద్దరు కొన్నాళ్లు సంతోషంగానే ఉన్నా ఎందుకో అనివార్య కారణాల వలన విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి జీవితాలు వారు గడుపుతున్నారు.
తన జీవితంలో అంత పెద్ద ఎదురుదెబ్బ తగిలినా కూడా ఏ మాత్రం రాజి పడకుండా కెరీర్ ని మరింత పటిష్టం చేసుకొని వరుస సినిమాలతో దూసుకుపోతుంది సమంత. ఆమె నటించిన యశోద చిత్రం మరి కొద్ది రోజులలో విడుదల కానుంది. ఇక సమంత గత కొంత కాలం నుండి చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని..ఆమె సర్జరీ చేయించుకోవడం కోసం ఇటీవల అమెరికా కి వెళ్లిందని.. అందుకే సినిమాల షూటింగ్స్ ని కూడా పక్కన పెట్టేసిందని సోషల్ మీడియాలో ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి..
ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ వచ్చే సమంత ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు వెంటే స్పందిస్తుంది. కాని ఆమె ఇటీవల సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్గా ఉండడం లేదు.తనపై వచ్చే రూమర్స్ ఖండించడం లేదు. దీంతో ఏమైందా అని అందరు ఆలోచనలో పడ్డ సమయంలో సమంత.. ఆసుపత్రి నుంచే ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆరోగ్యం విషయంపై ఓ క్లారిటీ ఇచ్చింది. ‘యశోద’ ట్రైలర్కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. గత కొన్ని నెలల నుంచి మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. అయితే, నేను అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నేను పూర్తిగా కోలకునే రోజు అతి దగ్గర్లోనే ఉంది. ఐ లవ్ యూ’ అంటూ సమంత తన పోస్ట్లో రాసుకొచ్చింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…