Salaar : బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా మారిన ప్రభాస్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ ఇలా వరుస చిత్రాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆది పురుష్’ చిత్రం జూన్ 16 వ తేదీన విడుదల కాబోతుంది, ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలను చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది మూవీ టీం.ఈ చిత్రానికి కంటే కూడా ప్రభాస్ అభిమానుల నుండి ప్రేక్షకుల వరకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ ని మాస్ లుక్లో చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ని అలా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రస్తుతం సలార్ఖి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే చిత్రంలోని యాక్షన్ సీన్ని రూపొందించడానికి టీమ్ 35 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది అని తెలుస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. జగపతి బాబు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు, ఆయన పాత్రకి సంబంధించిన షూటింగ్ కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేశారట.ఇక ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల కాబోతుంది అంటూ గత కొంత కాలం నుండి ప్రచారం అవుతున్న వార్త.
అయితే అందులో నిజం లేదని కొందరు అంటున్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోందని అంటున్నారు. ఏకంగా 400 మంది రౌడీలతో ఈ క్లైమాక్స్ ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ లోనే ప్రభాస్ రెండో క్యారెక్టర్ కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందట. అందుకే, ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వండర్స్ ని క్రియేట్ చేస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. మొత్తమ్మీద ఈ పాన్ ఇండియా సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. కాగా ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా భారీగా కసరత్తులు చేస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…