Sai Pallavi : లేడి పవర్ స్టార్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో అందర్నీ ఫిదా చేసిన సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఇకపై సినిమాల్లో నటించదనే వార్తకు బలం చేకూర్చే వాదనలు కూడా ఉన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సాయి పల్లవి లాంటి నటి ఇక సినిమాలలో కనిపించదు అనే సరికి అందరు షాక్లో ఉన్నారు.
ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తనకంటూ ప్రత్యేకత నిలబెట్టుకుంది. సహజ నటనతో వేలాదిగా అభిమానుల్ని సొంతం చేపుకున్న ఈ భామ రానాతో నటించిన విరాటపర్వం, లేడీ ఓరియంటెడ్ సినిమా గార్గి అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఆ తరువాత సాయి పల్లవి ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. అంతేకాదు..సినిమా ఆఫర్లు వచ్చినా తిరస్కరింస్తుందని టాక్ నడుస్తుంది. సినిమాలకు ఎందుకు దూరంగా ఉందని ఆందోళన చెందుతున్న ఆమె అభిమానులకు ఇప్పుడు షాక్ తగిలే న్యూస్ అందించింది.
సాయిపల్లవి యాక్టర్ కాకముందు డాక్టర్.. అంతకంటే ముందు డాన్సర్. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. జార్జియాలో ఎంబీబీఎస్ చదివిన సాయిపల్లవి.. ఇండియా వచ్చి.. డాన్ మీద ఇంట్రెస్ట్ తో..నటనమీద ప్రేమతో హీరోయిన్ గా మారింది. చాలా తక్కువ టైమ్లోనే స్టార్ హీరోయిన్గా మారింది. అయితే తన వృత్తికి న్యాయం చేయాలి అనుకుంటుందట ఈ మలబారు బ్యూటీ. దాని కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటుందట సాయి పల్లవి. అందుకే నటనకు గుడ్ బై చెప్పి.. డాక్టర్ గా సెటిల్ అవ్వబోతున్నట్టు ఓ న్యూస్ ఇండస్ట్రీ అంతా చక్కర్లు కొడుతుంది. కోయంబత్తూర్లో సొంతంగా ఒక హాస్పిటల్ను నిర్మిస్తోందని తెలుస్తోందట సాయి పల్లవి. ఈ ఆస్పత్రిని సాయిపల్లవితో పాటు ఆమె చెల్లెలు పూజా కలిసి చూసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది. మరి దీనిలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…