Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్గా విరూపాక్ష సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు.తన కెరీర్లోనే బడా సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అయితే ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా తనని కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ నే యువకుడిని స్వయంగా కలిసినట్లు మెగా హీరో చెప్పాడు. ఫోన్ నంబర్ ఇచ్చానని, అతనికి ఏ అవసరమొచ్చినా అండగా ఉంటానని తెలిపాడు. ఈ వీడియో వైరల్ కాగా.. అతన్ని కాపాడిన వ్యక్తి మాత్రం అందులో ఏ మాత్రం నిజం లేదంటున్నాడు.
యాక్సిడెంట్ తర్వాత మెగా హీరోలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరూ తనతో మాట్లాడలేదన్నాడు. కానీ యూట్యూబ్ వీడియోల్లో రామ్ చరణ్ తనకు బండి ఇచ్చారని, చిరంజీవి రూ. 5 లక్షలు ఇచ్చారని ఎన్నో వార్తలు వచ్చాయి. సాయి దరమ్ తేజ్ కూడా తనకు ఎల్లప్పుడు అండగా ఉంటానని మాట ఇచ్చినట్టు కూడా హామీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అయితే సాయిధరమ్ తేజ్ వ్యాఖ్యలు అబ్దుల్ వరకు చేరడంతో అతను మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘నేను కూడా ఆ వీడియో చూశాను. ఇప్పటి వరకు సాయిధరమ్ తేజ్ లేదా ఆయన టీమ్ ఎవరూ నన్ను కలవలేదు. నంబర్ కూడా ఇవ్వలేదు.
అప్పుడు సీఎమ్ఆర్లో పని చేసేవాడిని. కాని ఆ ఫేక్ న్యూస్ వల్ల అక్కడ టార్చర్ భరించలేకపోయా. చాలా మంది వచ్చిన నీకు డబ్బులు ఇచ్చారంట కదా అని అడుగుతుండటంతో జాబ్ మానేశా. ఆ తర్వాత నాలుగైదు నెలలు ఖాళీగా ఉన్నా. ఇప్పుడు అమెజాన్లో డ్రైవింగ్ చేస్తున్నా’ అని తెలిపాడు అబ్దుల్. అయితే సాయిధరమ్ తేజ్ కాల్ చేస్తే వెళ్లి కలుస్తానని చెప్పాడు. కానీ దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం స్ర్పెడ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు. ఫేక్ న్యూస్ వలన నాకు నష్టం తప్ప లాభమేమి జరగలేదని అబ్ధుల్ అన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…