Roja : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వైసీపీ నుండి ఒకవైపు జగన్ విమర్శల వర్షం కురిపిస్తుంటే మరోవైపు రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి వంటి వారు దారుణమైన విమర్శలు కురిపిస్తున్నారు. రోజా టీడీపీ నాయకులని చీల్చి చెండాతుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగ తిరుపతిలోని ఒక కార్యక్రమంలో పాల్గొన్న రోజా రాష్ట్రంలో దొంగలు, డెకాయిట్స్ లకు గురువు చంద్రబాబు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో నేర్పించడంలో చంద్రబాబు దిట్ట అని మంత్రి ఆర్కే రోజా అభివర్ణించారు.
చంద్రబాబుకు ఇచ్చిన ఐటీ నోటీసులపై టిడిపి నేతలు ఎందుకు నోరు విప్పడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. సినిమాలలో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే దోచుకోవడంలో చంద్రబాబు కలెక్షన్ కింగ్ అంటూ మంత్రి రోజా దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ అవినీతి అక్రమాలపై సిబిఐ, ఈడి విచారణ జరపాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పిఏ శ్రీనివాస్ ఇంట్లో వేలకోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయని పేర్కొన్న రోజా దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇక త్వరలో చంద్రబాబును తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కేసీఆర్ తరిమేస్తాడు అంటూ సంచలన ఆరోపణలు కూడా చేసింది.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిరోజు ఉపాధ్యాయులను పూజించాలని పేర్కొన్న రోజా, తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానమని సూచించారు. ప్రతి ఒక్కరూ గౌరవించేది, గౌరవించాల్సింది ఉపాధ్యాయుడినేనని మంత్రి రోజా పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలలను అభివృద్ధి చేసి, విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసింది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆమె తెలియజేసింది. ఒకప్పుడు నారాయణ, చైతన్య స్కూల్లో చదవడానికి సీటు దొరికేది కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలకు తీసుకువచ్చిన ఘనత వైయస్ జగన్ దేనని పేర్కొన్నారు. కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మార్కులు సాధించారని మంత్రి రోజా గుర్తు చేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…