Roja : జబర్ధస్త్ కార్యక్రమంలో సందడి చేసిన కమెడీయన్స్ ఇప్పుడు హీరోలుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్, గెటప్ శీను, చమ్మక్ చంద్ర వంటి వారు ప్రధాన పాత్రలుగా సినిమాలు రూపొందాయి. ఇప్పుడు రాకింగ్ రాకేష్ హీరోగా సినిమా రూపొందుతుంది. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై గరుడవేగ మేకింగ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ఈ సినిమా ప్రారంభం కాగా, గరుడవేగ లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలకు డీవోపీ గా పని చేసిన అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య కథనాయికగా నటిస్తోంది. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఇక ఈ చిత్రానికి తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ క్లాప్ కొట్టాగా.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి గౌరవ దర్శకత్వం వహించి సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు. చిత్ర ప్రారంభోత్సవంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఫౌండర్ రాఘవ, విఎన్ ఆదిత్య, ప్రవీణ, అనిల్ కడియాల, ధనరాజ్, తాగుబోతు రమేష్, అదిరే అభి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి కొన్ని మొక్కలు నాటారు. ఈ చిత్రాన్ని ఒక పల్లె మట్టివాసన తెలిసే చిత్రంగా రూపొందనుందని చిత్ర బృందం తెలిపింది.
రాకేష్ నా కొడుకు లాంటివాడు. ఎప్పటి నుంచో తనకి లీడ్ రోల్ చేయాలని వుంది. ఈ సినిమాతో అది నెరవేరుతోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మరెన్నో సినిమాలు చేసి ప్రజలకు ఆనందాన్ని పంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని రోజా పేర్కొంది. ఇక తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. రాకేష్ ప్రతిభావంతుడు. హీరోగా, నిర్మాతగా ప్రయాణం మొదలుపెట్టడం అనందంగా వుంది. రాకేష్ మా గురువు గారు రాళ్ళపల్లి గారి కూడా ఇష్టమైన శిష్యుడు. చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి రాకేష్ మరో పది సినిమాకు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మంచి నటుడిగా, నిర్మాతగా గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అని చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు సంతోష్.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…