MS Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించి మూడేళ్లు అవుతున్నా కూడా ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ధోని ని అభిమానిస్తారంటే అతి శయోక్తి కాదేమో. ఇప్పటికీ ధోని కనపడితే చాలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు, అలానే షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చాలా ఆసక్తి చూపుతుంటారు. మహేంద్రుడు ఎక్కడ కనిపించినా చాలు ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు. అయితే.. కొందరు ఈ విషయంలో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు.
ఇటీవల ఎంఎస్ ధోని ఆయన భార్య సాక్షితో కలిసి విమానంలో ప్రయాణం చేశారు. అయితే.. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత కాసేపటికి సీట్లోనే నిద్రపోయారు. పక్కనే భార్య సాక్షి కూడా ఉన్నారు. అయితే.. విమానంలోని ఒక ఎయిర్హోస్టెస్ ధోనీని గమనించింది. అతనంటే ఆమెకు బోలెడు ఇష్టం కావొచ్చు. ఉత్సాహం కనబర్చింది. ధోనీ నిద్రపోతుండగా ఎవరికీ తెలియకుండా వీడియో తీసింది. ఈ వీడియోను సోషల్మీడియాలోనూ అప్లోడ్ చేసింది. ధోనీ ఇక్కడే ఉన్నారు.. చూడండి అంటూ వీడియో తీసిన ఎయిర్హోస్టెస్ నవ్వుతూ పక్కనే ఉండగా, ఆ వీడియో మాత్రం తెగ వైరల్ అయింది. అయితే నిద్రని డిస్ట్రబ్ చేస్తున్నావంటూ కొందరు సదురు ఎయిర్హోస్టెస్ తీరుపై ఫైర్ అవుతున్నారు.
ప్రస్తుతం ధోని ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఈ సీజన్ ముగిసిన వెంటనే మహేంద్రుడు మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం రాంచీలోని తన ఫామ్ హౌస్లో కోలుకుంటున్నాడు. ధోని బాగానే ఉన్నాడని, ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నట్లు ఇటీవల ఆయన సతీమణి సాక్షి తెలియజేసింది. కాగా.. ఐపీఎల్ 2023 సీజన్ తనకు ఆఖరిది కాదని 2024 సీజన్ ఆడాలని ఉన్నట్లు గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని తన మనసులో మాటను బయటపెట్టాడు. అయితే.. ఇది రానున్న నెలల్లో తన శరీరం సహకరించే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…