జైల‌ర్ డైలాగ్‌తో ప‌వ‌న్, చంద్ర‌బాబు, లోకేష్‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన రోజా

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన స్కీమ్స్ నిధులను సీఎం జగన్‌ మోహన్ రెడ్డి విడుదల చేసిన విష‌యం తెలిసిందే. సోమవారం చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన బహిరంగ సభలో బటన్ నొక్కి విడుదల చేశారు. ఏప్రిల్–జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.680.44 కోట్లను నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. జ‌గ‌న్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. నగరిలో జగనన్న పేరు చంద్రబాబు నాయుడు గుండెల్లో రీసౌండ్‌ రావాలని అన్నారు. ఒకప్పుడు పెత్తందార్ల ఆస్తి అయిన విద్యను పేదవాడి హక్కుగా మార్చారని అన్నారు. దేశ భవిష్యత్‌ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని ప్రముఖ విద్యావేత్త కొఠారి చెప్పిన మాటలను సీఎం జగనన్న అక్షరాలా ఆ మాటను నిజం చేస్తున్నారని చెప్పారు.

జగనన్నకు ఒక చిన్న రిక్వెస్ట్.. అన్నా ఇన్ని లక్షల మందికి విద్యాదీవెన ఇస్తున్నాం.. కానీ ఇంకో ఇద్దరికి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా.. వారు ఎవరో కాదు పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు. పవన్‌ ఒక ఇంటర్వ్యూలో ఇంటర్‌లో తను సీఈసీ అని ఒకసారి.. హెచ్‌ఈసీ అని ఒకసారి ఎంపీసీ అంటారు. చంద్రబాబు ఇంజినీరింగ్‌ చదవాలంటే ఇంటర్‌లో బైపీసీ గ్రూప్‌ తీసుకోవాలంటారు. వీరిద్దరికీ విద్యాదీవెన వర్తింపజేయాలంటే ఏపీలో వారికి ఇల్లు లేదు ఓటు లేదు. ఆధార్‌ కార్డు కూడా లేదు. కాబట్టి సీఎంగా మీకు స్పెషల్‌ పవర్స్‌ ఉంటాయి. అవి ఉపయోగించి వారిద్దరికీ విద్యాదీవెనతో మంచి చదువు చెప్పించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అంది రోజా.

roja dialogues on nara lokesh and pawan kalyan and chandra babu

టీడీపీని నమ్ముకుంటే విద్యార్ధులు జైళ్ళకు వెళతారు, పవన్‌ను నమ్ముకుంటే సినిమాలకు వెళతారు కానీ జగనన్నను నమ్ముకుంటే మంచి కాలేజీలకు, యూనివర్శిటీలకు వెళ్లి జీవితంలో చక్కగా సెటిలవుతారు అని రోజా చెప్పుకొచ్చింది. నాకు ఈ మధ్యే రిలీజయిన రజనీకాంత్‌ సినిమా డైలాగ్‌ గుర్తుకొస్తుంది. మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరూ లేదు.. ఈ రెండూ లేని ఊరే లేదు. (ఇదే డైలాగ్‌ తమిళ్‌లో కూడా చెప్పారు.) పవన్‌ ఎంత విమర్శించినా.. లోకేష్‌ ఎంత మొరిగినా.. చంద్రబాబు ఊరూరు తిరిగి ఎన్ని అబద్దాలు చెప్పినా 2024 జగనన్న వన్స్‌మోర్‌ అని ప్రజలు పట్టం కట్టి 175 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను ధైర్యంగా రాయలసీమ గడ్డపై నుంచి చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నా.. నిన్ను సీఎం చేసిన కుప్పంకు వెళదాం.. అక్కడ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని ఇచ్చింది నువ్వా జగనన్నా అడుగుదాం.. నాన్నకొడుకులు గల్లీగల్లీ తిరిగినా ప్రజలు హైదరాబాద్‌ తరిమితరిమి కొట్టారు అంటూ రోజా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 mins ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

20 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago