ఢిల్లీలో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి లక్ష్మీ పార్వతిని ఆహ్వానించకపోవడం పట్ల లక్ష్మీ పార్వతి మండిపడింది ఉద్దేశపూర్వకంగానే తనకు ఆహ్వానం రాకుండా అడ్డుకున్నారని.. ఎన్టీఆర్ భార్యగా తనకు హాజరయ్యే హక్కు ఉందన్నారు. తనను ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారా లేదా అన్నది చెప్పాలని నిలదీశారు. ఇన్నాళ్లూ ఎన్టీఆర్ కుటుంబంపై గౌరవంతో మౌనంగా ఉన్నానని.. ఇకపై వారిని వదిలేది లేదన్నారు. అలాగే పురందేశ్వరి, చంద్రబాబుతో కలిసి కుట్రలు చేశారని.. నేటి నుంచి ఆమెపై పోరాటం ప్రారంభమైందన్నారు.చంద్రబాబు, పురందేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతానన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత వీళ్లు రాజకీయాల్లో ఉండకుండా చేస్తానన్నారు. వీళ్ల గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తానన్నారు.
చంద్రబాబు విలనిజం బయటకు కనిపిస్తుంది, కాని పురంధేశ్వరి అంతా లోలోపల నడిపిస్తుంది. అమాయకులైన పిల్లలతో ఆడుకుంటుంది. భువనేశ్వరి, పురంధేశ్వరి ఇద్దరు కూడా అసలు విలన్స్ అన్నట్టుగా లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది.ఎన్టీఆర్ కష్టాల్లో ఉంటే పురందేశ్వరి వచ్చారా అని ప్రశ్నించారు. తనను ఎందుకు చులకన చేస్తున్నారని.. తనను చులకన చేస్తే ఎన్టీఆర్ను చేసినట్టే అన్నారు. ఎన్టీఆర్ను చంద్రబాబు బయటకి వెన్నుపోటుకు ఇంటర్నల్గా పురందేశ్వరి ప్రధాన కారకురాలని విమర్శించారు. పురందేశ్వరి రాజకీయాల్లోకి వద్దనడంతో ఎన్టీఆర్పై కుట్ర చేశారన్నారు. తండ్రిపై కోపంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారన్నారు. ఇప్పుడు మళ్లీ బావామరదళ్ల ఏకమైపోయారని.. పురందేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి పనిచేయడం ఏంటన్నారు.
భువనేశ్వరి, పురందేశ్వరిలు తండ్రికి ద్రోహం చేశారని.. కేంద్రం భారతరత్న ఇస్తానంటే పురందేశ్వరి అడ్డుకున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఆమె అవినీతి చేశారని.. ఈరోజు నుంచి ఆమెపై తాను పోరాటం చేస్తాన్నారు.. చంద్రబాబు, పురందేశ్వరిని ఇంటికి పంపిస్తానన్నారు. జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందిందో లేదో తనకు తెలియదన్నారు లక్ష్మీపార్వతి. తారక్ ఢిల్లీ వెళితే చంద్రబాబుతో కలపాలని ప్రయత్నం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆహ్వానం అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యేవారన్నారు. ప్రైవేటు ఫంక్షన్ కనుకే ఆయన హాజరు కాలేదన్నారు. చంద్రబాబు స్క్రిప్ట్ పురందేశ్వరి చదువుతున్నారని.. సీఎం వైఎస్ జగన్కి వ్యతిరేకంగా భయంకర కుట్రలు చేస్తున్నారన్నారు లక్ష్మీ పార్వతి.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…