Rohit Sharma : ప్రస్తుతం టీమిండియాలో ఉన్న సీనియర్ బ్యాట్స్మెన్స్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండగా వారిద్దరి మధ్య లోలోన విభేదాలు నడుస్తున్నాయనే ప్రచారం కొన్నాళ్లుగా నడుస్తూనే ఉంది. కెప్టెన్సీ నుండి తప్పుకున్న తర్వాత విరాట్ చాలా మదనపడ్డాడట. తాజాగా ఆర్సీబీ పోడ్కాస్ట్లో మాట్లాడిన కోహ్లీ.. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ప్లేయర్గా జట్టులో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆటగాడిగా జట్టులో సర్దుకోవడానికి మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాడట.. కెప్టెన్ను కాదనే విషయాన్ని వొంటబట్టించుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది. జట్టులో ఓ సాధారణ ప్లేయర్గా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది అని విరాట్ అన్నాడు.
కెప్టెన్సీ అలవాటులో భాగంగా మైదానంలో కొన్నిసార్లు ఏదో నిర్ణయం తీసుకోవడానికి, సలహాలు చెప్పడానికి ముందుకు వచ్చేవాడిని . అయితే ఆ వెంటనే ‘నువ్వు కెప్టెన్ కాదురా అయ్యా’అనే విషయాన్ని నాకు నేను చెప్పుకునేవాడిని. చాలాసార్లు ఏదో చెప్పాలని అనుకునేవాడిని. అలా చాలా సార్లు.. అనేక సందర్భాల్లో ముందుకు వచ్చి వెనకడుగు వేసేవాడిని. మన అభిప్రాయానికి విలువ లేదని తెలిసినా చెప్పడం అవివేకమే అవుతుంది. ఆర్సీబీ విషయంలో నాకు ఈ ఇబ్బంది లేదు. డుప్లెసిస్కు నేను ఏది చెప్పిన వింటాడు. నా మాటకు గౌరవం ఇస్తాడు. ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకోవడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని కోహ్లీ అన్నాడు. అయితే కోహ్లీ చేసిన కామెంట్స్ లోతుల్లో చాలా అర్థాలే దాగున్నాయి. మాజీ కెప్టెన్ కోహ్లీ మాటలు చూస్తే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని స్పష్టం అవుతుంది.
అయితే కొన్ని నెలల క్రితం వరకు కోహ్లీ ఫామ్ లేమితో చాలా ఇబ్బంది పడ్డాడు. జట్టు నుండి అతనిని తప్పించాలనే వాదన కూడా మొదలైంది. ఆ సమయంలో రోహిత్ శర్మ ఆయనకు సపోర్ట్గా నిలాచాడు. కోహ్లీ లాంటి ఆటగాడి అవసరం టీమిండియాకు ఉందని అన్నారు. ఇక టీ20 వరల్డ్ కప్ 2022లో పాకిస్థాన్పై కోహ్లీ 82 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించిన తర్వాత.. గ్రౌండ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన రోహిత్.. కోహ్లీని అమాంతం ఎత్తుకున్నాడు. ఇలా పలు సందర్భాలతో కోహ్లీ-రోహిత్ ప్రవర్తన వారి మధ్య విబేధాలు ఉన్నట్టు అనిపించేలా చేయలేదు. అయితే కోహ్లీని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చిన రోహిత్ గురించి ఏ నాడు కోహ్లీ పాజిటివ్గా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా డుప్లెసిస్ని పొగిడి రోహిత్ తప్పు చేశాడనే విధంగా వ్యాఖ్యలు చేశాడు. దీనిపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Monica Siva : ఇండియన్ సినిమాల్లో కొన్ని చిత్రాలు ప్రేక్షకులకి మంచి ఆసక్తిని కలిగిస్తాయి. ఆ సినిమాలు మంచి మజాతో…
OTT Suggestion : ఇటీవలి కాలంలో థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయో మనం చూస్తున్నాం.…
CM YS Jagan : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా రంజుగా సాగుతుంది. ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారా…
Aisha Sharma : చిరుత బ్యూటీ నేహా శర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. రామ్ చరణ్తో తెగ రొమాన్స్…
Nagababu : మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అంటూ కొణిదెల నాగబాబు…
Krishnamma OTT : ఒకప్పుడు థియేటర్స్లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావడానికి కనీసం 3 నెలలు అయిన సమయం పట్టేది.…
Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ భామ…
Shiksha Das : ఐపీఎల్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరికి మంచి మజాని అందిస్తుంటుంది. క్రికెట్ ప్రియులు, హీరోయిన్స్,పలువురు స్టార్స్ కూడా…