RK Roja : ఈ సారి ఏపీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా మారాయో మనం చూశాం. చాలా టఫ్గా ఫలితాలు ఉంటాయని అందరు అనుకున్నారు. కాని ఎవరు ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వన్ సైడ్ అయ్యాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి క్లీన్ స్వీప్ చేశారని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. వైసీపీ మంత్రులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో.. ఆ పార్టీకి పరాభవం ఎదురైంది. పెద్దిరెడ్డి మినహా అందరు మంత్రులు ఓటమి పాలయ్యారు. ఇక నగరిలో మంత్రి ఆర్కే రోజా తన సమీప టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాశ్పై 43,505 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ తరుణంలో రోజా తన ఓటమిని అంగీకరిస్తూ.. ఎక్స్ వేదికగా ఫలితాలపై ఆసక్తికర ట్వీట్ చేశారు.
చిరునవ్వులు చిందిస్తున్న తన ఫోటోను పంచుకుంటూ.. ‘భయాన్ని విశ్వాసంగా… ఎదురు దెబ్బలను మెట్లుగా.. మన్నింపులను నిర్ణయాలుగా.. తప్పులను పాఠంగా నేర్చుకుని, మార్చుకునే వాళ్లే శక్తిమంతమైన వ్యక్తులుగా మారతారు’ అంటూ ఆ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అయితే ఎవరైతే పవన్ కళ్యాణ్పై తప్పుడుగా ప్రచారం చేశరో వారు ఎన్నికలలో దారుణాతి దారుణంగా ఓడిపోయారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా.. రాష్ట్రానికి అదేదో ఆపద వచ్చిపడినట్టు, రాష్ట్రాభివృద్ధి ఆగిపోయినట్టు పవన్ మూడు పెళ్లిళ్ల గురించి పదే పదే మాట్లాడుతుంటారు. చివరికి సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఎన్నోసార్లు పవన్పై వ్యక్తిగత విమర్శలు చేశారు.
‘కార్లను మార్చినట్లు పవన్ భార్యలను మారుస్తాడని’ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యారేజీ స్టార్ ఆడవాళ్లను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తాడని పేర్కొన్నారు. ఇక అంబటి రాయుడు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజాతో పాటు కొందరు పవన్పై తీవ్ర విమర్శలు చేయగా అందుకు మూల్యం చెల్లించుకున్నారు. వీరంతా కూడా ఈ సారి ఏపీ ఎన్నికలలో ఘోర పరాజయం చెందారు. ఇక పవన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…