RGV : ఎప్పుడు వివాదలతో వార్తలలో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ ఇటీవల అంబర్ పేట వీధికుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రదీప్ కుటుంబం తరపున గట్టి పోరాటమే చేస్తున్నాడు. తన ట్విట్టర్ వేదికగా అటు ప్రభుత్వాన్ని, ఇటు జంతు ప్రేమికులను.. మధ్యలో వచ్చిన మేయర్ గద్వాల విజయలక్ష్మిని.. ట్వీట్లతో ఏకిపారేశారు. ఈ ఎపిసోడ్లో ఆర్జీవీ తన మార్క్ ట్వీట్లే చేసినప్పటికీ.. వాటిల్లో ఎక్కడో ఓ మూల హ్యూమన్ యాంగిల్ అయితే తొంగి చూసింది. మానవతా ధృక్పథం అంటే మీనింగ్ నాకు తెలియదు అంటూ సెటైర్లు వేసే ఆర్జీవీ.. ఈ ఎపిసోడ్లో మాత్రం ముందు నుంచి బాధిత కుటుంబ తరఫున తన గొంతు వినిపిస్తూనే ఉన్నాడు.
రీసెంట్గా చిన్నారి కుటుంబానికి సాయం చేయండి అంటూ బ్యాంక్ అకౌంట్ నంబర్ ను సైతం సోషల్ మీడియాలో పెట్టారు వర్మ.ఇక తాజాగా కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయాలి అంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చాడు. ”కుక్కల సంఖ్యను నియంత్రించడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఉన్న కుక్కలన్నింటిని పట్టుకుని వాటిని ఒక దగ్గర చేర్చి, వాటికి కొన్ని నెంబర్లనో, పేర్లనో పెట్టి జంతు ప్రేమికులకు ఇవ్వండి. లేదా కుక్కల్ని ప్రేమించే వారికి టాక్స్ వేయండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వర్మ. ఒకవేళ అది కుదరని పక్షంలో మేయర్ గానీ, అంతకంటే కింది స్థాయి వ్యక్తులు గానీ ఎవరైనా తమ ఆస్తిని కొడుకులకు కాకుండా కుక్కల పెంపకానికి రాసివ్వమనండి అంటూ కాస్త సెటైరికల్ కామెంట్ చేశారు.
రాజ్యాంగ ప్రకారం, చట్టబద్దంగా టాక్స్ వేస్తే నేను కట్టడానికి రెడీ అని వర్మ తెలిపారు. అంతేగాని ఊరికే అడిగితే నేను డబ్బులు ఇవ్వను అని అన్నాడు. ఇక కుక్కల్ని ప్రేమిస్తున్నాం అంటూ తహతహలాడే వారందరికి తప్పక ట్యాక్స్ వేయాలంటూ రామూజీ ఓ ఉచిత సలహా అయితే ఇచ్చాడు. వర్మ నుంచి ఇలాంటి పరిణామం చూసి.. తన పేరు చెబితేనే చీదరించుకునే వాళ్లతో కూడా.. సార్.. మీరు మారిపోయారు సార్.. అనే డైలాగ్ చెప్పేలా చేశాడు ఆర్జీవీ. ఇక బాధితుడి కుటుంబానికి అండగా ఉండాలన్న ఆర్జీవీ అభ్యర్థనకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…