Revanth Reddy : మరికొద్ది రోజులలో తెలంగాణ ఎన్నికలు సమీపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి కేసిఆర్,మంత్రులు హరీష్ రావు,కేటీఆర్ సహా అనేక మంది ఎమ్మెల్యేలు,ఎమ్మెల్యే అభ్యర్థులు గురువారం ఆయా నియోజకవర్గాల్లో తమ నామినేషన్లను దాఖలు చేశారు.కేంద్ర ఎన్నికల సంఘానికి వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఈ నాయకుల ఆస్తి,ఇతర వివరాలు ఉన్నాయి. అయితే కేసీఆర్పై అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో పలువురు క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయమే వృత్తిగా భావిస్తూ.. ఎక్కువ సమయం తన వ్యవసాయ క్షేత్రంలోనే గడిపే కేసీఆర్కు తన పేరు మీద ఎలాంటి భూమి లేకపోవటమనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అలా అని.. కేసీఆర్కు ఆస్తులేమి లేవని కాదండోయ్. ప్రత్యేకంగా ఆయన పేరు మీద ఎలాంటి భూములు లేకపోయినా.. ఉన్న స్థలాలన్ని కుటుంబ ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయంట. కేసీఆర్ కుటుంబానికి మొత్తంగా 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 కరాల మేర వ్యవసాయేతర భూములున్నట్టు పేర్కొన్నారు. కాగా.. 4 నెలల కిందే అంటే జులైలో మర్కూక్ మండలంలోని శివారు వెంకటాపురం గ్రామంలో 10 ఎకరాల సాగుభూమిని కేసీఆర్ కుటుంబం కొనుగోలు చేసింది. ఈ భూమి విలువ సుమారు రూ. 28.47 లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు.
ధరణిని రద్దు చేస్తామని మీరు చెప్పారు. అదే విషయాన్ని కేసీఆర్ కూడా ప్రచారం చేస్తున్నారు.. అని ప్రశ్న ఎదురు కాగా, దానికి స్పందించిన రేవంత్ రెడ్డి.. ధరణిని రద్దు చేస్తామని చెప్పిన మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఇంతకంటే మెరుగైన దానిని తీసుకొచ్చి అమలు చేస్తాం. గతంలో కాంగ్రెస్ పార్టీయే భూ భారతిని తీసుకొచ్చింది. రికార్డులు డిజిటలైజ్ చేయాలనేది మా ఆలోచన! కానీ, కేసీఆర్ ఆ రికార్డులను మాయం చేసి, విధ్వంసం చేసి లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు, పోడు పట్టాలన్నింటినీ గందరగోళం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల భూములకు కొత్త యజమానులు పుట్టుకొచ్చారు. పాస్ పుస్తకాలు జారీచేశారు. కేసీఆర్ ఈ ధరణి పథకంతో రూ.లక్షల కోట్లు సంపాదించారు. 10 వేల ఎకరాల భూమి గోల్మాల్ అయితే.. ఎకరం పది కోట్లు అనుకున్నా లక్ష కోట్లు అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు భూమి 6,500 ఎకరాలు ఉంటుంది అని అన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…