Payal Rajput : పాయల్ రాజ్పుత్.. ఈ అందాల ముద్దగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంగళవారం సినిమాతో రీసెంట్గా ప్రేక్షకులని పలకరించిన పాయల్ రాజ్పుత్ ఈ సినిమా హిట్తో తన ఖాతాలో మంచి విజయం వేసుకుంది. ఆర్ఎక్స్ 100 చిత్రంతో డైరెక్టర్గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అజయ్ భూపతి తీసిన తాజా చిత్రమే ‘మంగళవారం కాగా, ఈ మూవీని స్వాతి గుణుపాటి, సురేష్ వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి అంజనీష్ లోక్నాథ్ సంగీతాన్ని ఇచ్చాడు. ఇందులో అజయ్ ఘోష్, నందిత శ్వేత, కృష్ణ చైతన్య, దివ్య పిళ్లై తదితరులు కీలక పాత్రలు చేశారు.
మంగళవారం చిత్రంలో మీకు పాత్ర ఎలా వచ్చింది అని పాయల్ని మీడియా అడగగా, దానికి స్పందించిన పాయల్.. నేనే అజయ్ని అవకాశం ఇవ్వాలని అడిగాను. అయితే మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు కచ్చితంగా ఇస్తానని.. చిన్న చిన్న పాత్రలకు నన్ను తీసుకోవడం ఇష్టం లేదన్నాడు. మొత్తానికి మంగళవారం సినిమాలో నాకు ఛాన్స్ దక్కింది. తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ సంచలనం అవుతుంది. ఎందుకంటే ఇలాంటి పాత్రతో ఇప్పటివరకు ఎవరూ సినిమా తీయలేదు” అంటూ పాయల్ బదులిచ్చింది. శైలూ రోల్ విలన్ కాదు. సినిమా చూసిన తర్వాత మీకు శైలుపై మీకు సానుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో చాలా రకాలైన ఎమోషన్స్ ఉంటాయి. నేను ఇంతకు ముందు చాలా ఇంటెన్సివ్ రోల్స్ చేశాను.. కానీ ఇలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. కథ విన్న తర్వాత మళ్లీ అజయ్ భూపతితో కలిసి పనిచేస్తున్నానని మా అమ్మకు చెప్పాను.
ఆడిషన్స్ గురించి తెలిసిన తర్వాత నేను అజయ్ భూపతికి కాల్ చేశాను. నన్ను ఎందుకు కన్సిడర్ చేయడం లేదని అడిగాను. అప్పుడే నా గురించి ఆలోచించారు. ఎందుకంటే ఆయన టాలెంట్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అందుకే మరోసారి కలిసి పనిచేయాలని ట్రై చేశాను అని పాయల్ చెప్పింది. అయితే మంగళవారం విజయం తర్వాత మీడియా ముందు మాట్లాడడానికి వచ్చిన పాయల్ని కార్తికేయ ఫ్యాన్స్ తెగ ఇబ్బంది పెట్టేశారు. అయినప్పటికీ పాయల్ చాలా ఓపికగా సమాధానం ఇచ్చింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…