Revanth Reddy : తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావిడి నడుస్తుంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తామంటే తాము గెలుపుబాట పడుతున్నామని చెబుతున్నారు. దొరల పాలనలో విభజించి పాలించడం ఎప్పటి నుంచో వస్తున్న అనవాయితీ.. ఆరోగ్యంగానే సీఎం కేసీఆర్ ఆదివాసి లంబాడీల మధ్య మనస్పర్ధలు తెచ్చి వారిని వేరు చేశారని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్ను చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోందన్నారు. ఒకనాడు డీలర్గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు డాలర్ దయాకర్ రావు అయ్యారని వ్యాఖ్యలు చేశారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు దందాలు చేస్తే… ఝాన్సీ రెడ్డి కుటుంబం పేదలకు సేవలు చేశారని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు కాలేజీలు, ఆసపత్రుల కోసం 80 ఎకరాల భూమి కొంటే దయాకర్ రావు లిటిగేషన్లు పెట్టి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో పాలకుర్తిలో ఈ దొరను… తెలంగాణలో ఆ దొరను ప్రజలు ఈ బొంద పెట్టడం ఖాయమని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ‘కేసీఆర్కు సవాల్ విసురుతున్నా… 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే.. లేకపోతే వరంగల్ ఏకాశిలా పార్కు వద్ద ముక్కు నేలకు రాస్తావా? రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణను అమ్ముకుంటాడని కేసీఆర్ అంటుండు.. కేసీఆర్.. 2009లో నువ్వు సికింద్రాబాద్ ఎంపీ సీట్లు అమ్ముకున్నావ్. రాజ్యసభ సీట్లు కూడా అమ్ముకున్న దుర్మార్గుడివి నువ్వు.
ఈ ఎన్నికలు కేసీఆర్ నలుగురు కుటుంబ సభ్యులకు… నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. దొరల తెలంగాణ కావాలో.. ప్రజల తెలంగాణ కావాలో నిర్ణయించుకోండి’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.అయితే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. టీవీ9పై ఫుల్ సీరియస్ అవుతున్న ఈ వీడియోలో తొక్కిపట్టి నారతీస్తానని అన్నాడు. అడ్డగోలు పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారో పండబెట్టి తొక్కి పేగులు తీస్తానని అన్నాడు. పేపర్, టీవీ9 నా కొడుకులు మైకులు తీసుకొచ్చి పెడితే వాటికి వివరించే ఓపిక తీరిక లేదంటూ రేవంత్ రెడ్డి ఒకింత ఘాటుగానే స్పందించారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…