Renuka Chowdary : తెలంగాణ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాజకీయం మరింత వేడెక్కిపోతుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అలానే ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ గాలి వీస్తోందని రేణుకా చౌదరి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత మెజారిటీ తప్పకుండా సాధిస్తామని, సీఎం ఎవరనేది గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్టానం నిర్ణయిస్తారని చెప్పారు. డీకే శివకుమార్లా పదవిని త్యాగం చేసే గుణం అందరిలో ఉండాలంటూ సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లను ఖచ్చితంగా గెలుస్తామంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు.
ఏపీలో నేను పోటీ చేయాలని, ప్రచారం చేయాలని ఆహ్వానం ఉంది.. ఏపిలో నరకం అనుభవిస్తున్నారు.. విభజన జరిగినా సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరుని రేణుకా ఖండించగా,ఇప్పడు ఆయన తెలంగాణలో పోటీ చేయకపోవడంపై కూడా ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. బేరం పెట్టుకోకుండా పెద్దమనసుతో కాంగ్రెస్ గెలవాలని వారు పోటీ చేయకుండా ఉండడం గొప్ప విషయం . ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అందరు కలుస్తున్నారు. హస్తానికి ఐదు వేళ్లు ఎలా ఉన్నాయో అలానే అందరు కలిసి గెలవాలని కోరుకుంటున్నారు అని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. తెలుగుదేశం పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్టు పడిందన్నారు.
పువ్వాడ అజయ్ దుష్టుడు, దుర్మార్గుడు అంటూ రేణుక విరుచుకుపడ్డారు. ఆయన డీఎన్ఏలోనే లోపం ఉందని విమర్శించారు. ఎవరూ కూడా నిస్సహాయంగా ఉండొద్దని… ఓటు అనే ఆయుధంతో అజయ్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మన భవిష్యత్తు కోసం తుమ్మల నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు చరిత్రలో మిగిలిపోతాయని అన్నారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…