Renu Desai : రేణు దేశాయ్ .. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, సినీనటిగా ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పవన్తో విడాకుల తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి సోలోగా ఉంటుంది. పిల్లలిద్దరిని తీసుకొని పూణేకి వెళ్లి అక్కడే ఇండివిడ్యువల్గా జీవిస్తుంది. సినిమాలకి దూరంగా ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక సమస్యలపై స్పందిస్తుంది. రీసెంట్గా ఫండ్ రైజ్ కోసం ఆమె వేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంది. పెట్స్ కోసం రైస్ అవసరం ఉందని, నెలకు మూడు వందల కేజీల రైస్ అవుతోందని, ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయండని ఓ పోస్ట్ను వేశారు.
ఆ పోస్ట్ని రేణూ దేశాయ్ షేర్ చేస్తూ.. అందరినీ కోరింది. తాను ఆల్రెడీ 50 కేజీల రైస్ ఇచ్చేశానని, మిగిలింది అందరూ కలిసి ఎంతో కొంత సాయం చేయండని వేడుకున్నారు. మాకు ప్రతి నెలా 300 కేజీల బియ్యం అవసరమవుతూ ఉంటుంది. 4 మంది సభ్యులున్న కుటుంబానికి ప్రభుత్వం నుండి 24 కేజీల బియ్యం అందుతుంది. కాబట్టి దయచేసి మీరు మాకు విరాళం ఇస్తే బాగుంటుంది. 10 కుటుంబాలు అలా రేషన్ అందిస్తే.. కుక్క పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ తో ఈ విషయాన్ని షేర్ చేయండి అంటూ రేణూ దేశాయ్ తన పోస్ట్లో కోరింది.
ఇక దీనిపై వెంటనే స్పందించిన హీరో అడివి శేష్.. . ఓ పెట్కు ట్రీట్మెంట్ అవసరం ఉండటంతో.. పదిహేను వేలు పంపించాడట. అలా వెంటనే స్పందించి సాయం చేసిన అడివి శేష్ను రేణూ దేశాయ్ పొగిడేసింది. అడివి శేష్ రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరోనే అంటూ పొగిడేసింది. అయితే అడివి శేష్ కూడా పెట్ లవర్ అన్న సంగతి తెలిసిందే. తన ఇంట్లోనూ పెట్స్ను పెంచుతుంటాడు. రేణూ దేశాయ్, అకిరాతో అడివి శేష్ ఎంతో క్లోజ్గా ఉంటాడన్న విషయం మనకు తెలిసిందే. అడివి శేష్, అకిరాలు కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటారు. రేణూ దేశాయ్ ఫ్యామిలీతో అడివి శేష్ ఎక్కువగా కలిసి ఉంటాడు. తరచు వారికి సంబంధించిన పలు విషయాలు షేర్ చేస్తూ ఉంటాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…