Venu Swamy : అక్కినేని యువ హీరో నాగ చైతన్య కొన్నేళ్ల క్రితమే స్టార్ హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నాడు. కానీ, కొద్ది వ్యవధిలోనే ఆమెకు విడాకులు కూడా ఇచ్చేశాడు. అది అయిన కొన్నాళ్లకే తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ మొదలెట్టాడు. కానీ, ఇది బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినప్పటికీ వీళ్లిద్దరి వ్యవహారం మాత్రం ముందుగానే లీక్ అయింది. అయితే ఆగస్ట్ 8న వారిద్దరు నాగార్జున ఇంట్లో నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇక ఈ ఎంగేజ్మెంట్ తర్వాత వారికి సంబంధించి వేణు స్వామి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాగ చైతన్య, శోభిత వైవాహిక జీవితం 2027 వరకు బాగానే ఉందని.. అక్కడి నుంచి వీరి వైవాహిక జీవితంలో మార్పులు చోటు చేసుకుంటాయని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఓ మహిళ కారణంగా వీరు విడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని వేణు స్వామి తెలిపారు. వీరు పెట్టుకున్న ఎంగేజ్మెంట్కు ముహూర్తం బలం, అలాగే జాతకం వీళ్లకు అనుకూలంగా లేవని వేణు స్వామి తేల్చేశారు. గతంలో సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోతారని చెప్పినప్పటి వీడియో బైట్ను చూపించారు. నాగచైతన్య జాతక రిత్యా తండ్రి స్థానం బలంగా లేదు. అది తన తండ్రి స్థానం కావచ్చు. లేకపోతే నాగచైతన్య తండ్రిగా మారడం కావచ్చు.
పెంపకం విషయంలో లోటు, పాట్లు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివాహం తదుపరి నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. నాగచైతన్యకు మాత్రం సహజసిద్ధంగా తండ్రి అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే తన జాతకబలం అలాంటిదని వేణు స్వామి బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ మధ్య సెలబ్రిటీల జాతకాలు చెప్పనని ప్రామిస్ చేసిన వేణు స్వామి తిరిగి ఇప్పుడు నాగ చైతన్య- శోభితల గురించి జాతకం చెప్పడంతో అతనిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…