Ravi Teja : సంక్రాంతి సందడి పూర్తైంది. ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో సినిమాల సందడి మొదలు కానుంది. మాస్ మాహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ‘ఈగల్’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. ఇందులో ఆయన ఇదివరకు ఎప్పుడూ కనిపించని సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ మూవీ సంక్రాంతి పండక్కి విడుదల కావాల్సి ఉంది. కానీ థియేటర్లు సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన హనుమాన్ మూవీ ఇంకా సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మూవీ యూనిట్ హనుమాన్ గ్రాటిట్యూడ్ మీట్ పేరుతో వేడుక నిర్వహించగా.. తాజాగా రవితేజతో కలిసి తేజ సజ్జ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మరోవైపు ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా తేజ సజ్జతో కలిసి రవితేజ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.రవితేజతో యంగ్ హీరో తేజ సజ్జా వారిద్దరి సినిమాల గురించి సరదాగా ముచ్చటించారు. ఈగల్ సినిమా గురించి ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకున్నారు తేజ. అంతకు ముందు హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు తేజను అభినందించారు రవితేజ.
రవితేజ వల్ల ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త హీరోలు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పి తేజ సజ్జ షాక్ ఇచ్చాడు. మీరు చేసే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఎందుకు ఉంటున్నారు అంటూ రవితేజను ప్రశ్నించాడు తేజ సజ్జ.మీ వల్ల కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే మాలాంటి వాళ్లు చాలా పాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. హీరోయిన్లు దొరకట్లేదు. మొత్తం 15 మంది హీరోయిన్లు ఉంటారు కావచ్చు. మీరు చేసే సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉంటున్నారు. మీరు ఏడాదికి మూడు చిత్రాలు చేస్తున్నారు. దాదాపు 12 మందిని ఆడిషన్స్ చేస్తారు. దీంతో ఎవరినీ అడిగినా మేం రవితేజతో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాతనే మూవీ చేస్తామని చెబుతున్నారు. మీరు ఇద్దరు ముగ్గురు హీరోయన్స్ను తీసుకోవడం వల్ల మాలాంటి యంగ్ హీరోలు ఇబ్బందులు పడుతున్నారు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు తేజ.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…