Allu Sneha Reddy : అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బన్నీ భార్యగానే అందరికీ పరిచయమైన స్నేహా.. తనకంటూ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ గుర్తింపు సాధించారు. వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టారు. పిల్లల కోసమే ప్రత్యేకంగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. పికబు అంటూ చిన్నారుల అవసరాలు, వారి ఆట వస్తువులు, వారిలో క్రియోటివిటీని పెంచేలా, వారిని ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చేసే పలు ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. రీసెంట్గా కూతురితో కలిసి వెళ్లిన స్నేహా రెడ్డి తెగ సందడి చేసింది.
అర్హ అయితే గేమ్స్ సరదాగా ఆడుతూ హుషారుగా కనిపించింది. అర్హని అలా చూసి ప్రతి ఒక్కరు మురిసిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే అల్లు స్నేహా పిల్లల పెంపకం గురించి ఓ వీడియోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసుకున్నారు. ఈ తరం పిల్లలు అయితే చదువులు లేదా ఇంటికి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. తల్లిదండ్రులు కూడా అల్లరి చేయకుండా ఒక దగ్గర కూర్చుని ఫోన్ చూస్తుండటంతో తలనొప్పి తగ్గిందని స్మార్ట్ ఫోన్లు అలవాటు చేస్తుంటున్నారు. దీని వల్ల పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతోంది. క్రియేటివిటీ లోపిస్తోంది. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి, వారికి ఫిజికల్ యాక్టివిటిని పెంచడానికి స్నేహా కొన్ని టిప్స్ ఇచ్చారు.
మొత్తం 6 పాయింట్లను తల్లిదండ్రులకు సూచించారు అల్లు స్నేహా. వాటిని పాటిస్తే పిల్లల్లో క్రియేటివిటీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. పిల్లలను ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండాలని, క్రియేటివ్ గా ఆలోచించాలని ప్రోత్సహించాలని మొదటి పాయింట్ చెప్పారు. వారం పాటు షెడ్యూల్ ప్రిపేర్ చేసి దానిని ఫాలో అవాలని, దీని వల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెరుగుతుందన్నారు. ఆరు బయట ఆడుకోనివ్వాలి, ప్రకృతి నుంచి కొత్త విషయాలు తెలుసుకోనివ్వాలి. ఫోన్, టీవీ, ల్యాప్టాప్ చూసే సమయాన్ని తగ్గించాలి. ఆలోచనా శక్తి పెంచుకునేలా ఎంకరేజ్ చేయాలి. జాలి, దయతో ఉండాలని వారికి నేర్పాలి. అలాగే మిగతా అన్ని పాయింట్లతో సమానమైన ప్రాముఖ్యత ఇవ్వాల్సింది ఆరో పాయింట్. అదే తమకు తాము కొంత సమయాన్ని కేటాయించుకోవడం అని చెప్పుకొచ్చారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…