Vizag Warriors : ప్రస్తుతం మనదేశంలో ఐపీఎల్కి ఉన్న డిమాండ్ అంతా ఇంతాకాదు. ప్రతి సీజన్ కూడా ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది.అన్ని దేశాలకి చెందిన క్రికెటర్స్ ఇందులో పాల్గొనడంతో గేమ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ అనే టీమ్ ఉండగా, ఇప్పుడు ఏపీ నుండి మరో టీమ్ ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. 2024లో ఐపీఎల్ లో రామ్ చరణ్ ఫ్రాంచైజీ నుంచి వైజాగ్ వారియర్స్ టీమ్ అడుగు పెట్టనుంది. గతేడాది ఐపీఎల్ లో గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలు అడుగు పెట్టాయి.
తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉంది. కానీ, ఆంధ్రప్రదేస్ నుంచి ఒక్క టీమ్ లేదు కాబట్టి వైజాగ్ వారియర్స్ పేరిట ఒక కొత్త ఐపీఎల్ టీమ్ తో వచ్చే ఏడాది నుంచి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ లో ఇప్పటికే వందల కోట్ల పెట్టుబడితో షారుక్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి వంటి వారు ఫ్రాంచైజీ యజమానులుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఫ్రాంచైజులు సగటను సీజన్ కు రూ. వంద కోట్లకుపైగా స్పాన్సర్ షిప్ ల ద్వారా సంపాదిస్తున్నాయి. అందుకే రామ్ చరణ్ కూడా ఆ దిశగా దృష్టి సారించాడని సమాచారం.జగన్, అంబటి రాయుడు వంటి వారు కూడా రామ్ చరణ్కి ఫుల్ సపోర్ట్ అందించనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే ఐపీఎల్లో ఇప్పుడు కొత్త జట్లకు అవకాశం లేదని తెలుస్తుంది.. గత ఏడాదే రెండు కొత్త ఫ్రాంచైజీలు ఎంట్రీ ఇచ్చాయి. గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్జెయింట్స్ ఫ్రాంచైజీలను బడా వ్యాపారవేత్తలు దక్కించుకున్నారు. గుజరాత్ టీమ్ను సీవీసీ క్యాపిటల్స్ , లక్నో టీమ్ను సంజీవ్ గోయెంకా టీమ్ వేలంలో కొనుగోలు చేశాయి. దీంతో ఐపీఎల్లో జట్ల సంఖ్య పదికి చేరింది. ఇప్పట్లో ఈ సంఖ్యను మరింత పెంచే ఉద్ధేశమైతే బీసీసీఐకి లేనట్టుగా తెలుస్తుంది. మరి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…