Rajinikanth : ఇటీవల జైలర్ సినిమాతో అతి పెద్ద విజయం సాధించిన రజనీకాంత్ దేశంలోని అనేక ప్రాంతాలు చుట్టేస్తున్నారు. పలువురు ప్రముఖులని కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను నటుడు రజనీకాంత్ కలిసి ఆ తర్వాత ఆయన పాదాలను తాకడంతో వీడియో వైరల్గా మారింది. ఈ చర్యే కొందరికి నచ్చలేదు. ‘‘72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలను తాకడం ఏంటి? మత పరంగా గుడ్డిగా వ్యవహరించినప్పుడే ఇలాంటిది సాధ్యపడుతుంది’’అని అక్షిత్ అనే యూజర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ‘‘వయసులో 20 ఏళ్ల పెద్ద అయిన రజనీకాంత్ మత విద్వేషాన్ని వ్యాప్తి చేసే సీఎం పాదాలను తాకారు. దక్షిణాది ప్రజలు ఆయనకు ఇచ్చిన గౌరవం రెండు సెకండ్లలో పోయింది. ఫాసిస్టులకు మద్దతు పలికిన వెన్నులేని వ్యక్తిగా చరిత్ర ఆయన్ని గుర్తు పెట్టుకుంది’’అని అమీనా అనే యూజర్ పోస్ట్ చేశారు.
ప్రధానంగా ఎక్కువ మంది యూజర్లు దీన్నే ఎత్తి చూపుతూ రజనీకాంత్ ను తప్పుపట్టారు. అయితే దీనిపై రజనీకాంత్ కూడా వివరణ ఇచ్చారు. తనకు యోగుల పాదాలను తాకే అలవాటు ఉందని అన్నారు. సన్యాసి అయినా, యోగి అయినా.. వారు నాకంటే చిన్నవారైనా సరే.. వారి పాదాలను తాకే అలవాటు నాకు ఉంది’ అని చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ అన్నారు. సన్యాసిగా శిక్షణ పొందిన యోగి ఆదిత్యనాథ్ను 2014లో గోరఖ్నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా నియమించారు. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం మంచి విజయం సాధించి 500 కోట్ల వసూళ్లు రాబట్టింది.
నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న గ్రాండ్ ’గా విడుదలైంది. తమన్నా హీరోయిన్గా చేసింది. ఇక ఈ సినిమా విడుదలైన రోజు నుంచి పాజిటివ్ టాక్ను తెచ్చుకుని వావ్ అనిపించింది. ఎప్పటిలాగే రజినీకాంత్ తన స్టైల్, లుక్స్ అండ్ డైలాగ్స్తో వావ్ అనిపించారు. దీనికి తోడు అలరించే థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రిలీజ్పై లేటెస్ట్గా ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సినిమా సెప్టెంబరు 7 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని లేటెస్ట్ టాక్. అంతేకాదు దాదాపుగా ఈ డేట్ ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. తెలుగు తమిళ ఓటీటీ రైట్స్ సన్ నెక్స్ట్ కలిగి ఉంది. ఇక హిందీ డబ్బింగ్ నెట్ఫ్లిక్స్లో అదే రోజు స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ విషయంలో అతి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…