Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 12న తన 72వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. తలైవా బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. అయితే ఆ రోజు కాకుండా బుధవారం (14న) సాయంత్రం తన కుమార్తె ఐశ్వర్యతో కలసి రజనీకాంత్ తిరుమలకు వచ్చారు. టీటీడీ అధికారులు రజనీకాంత్, ఆయన కుమార్తె దర్శనానికి తగిన ఏర్పాట్లు చేశారు. అయితే ఈ రోజు ఉదయం రజనీకాంత్, ఆయన కూతురు ఐశ్వర్య స్వామిని దర్శించుకున్నారు.
ప్రత్యేక క్యూలైన్ నుంచి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు రజనీకాంత్ అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి కడప జిల్లాలోని అమీన్ పీర్ దర్గాను సందర్శించేందుకు రజనీకాంత్ వెళ్లారు. దర్గా దర్శనానికి ఏఆర్ రెహమాన్ కూడా రానున్నారు. అయితే రజనీకాంత్ తన బీఎండబ్ల్యూ కారులో చెన్నై నుంచి రోడ్డు మార్గంలో బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అయితే రజనీకాంత్ ప్రయాణించిన కారుకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్గా జరిగింది.
రజనీకాంత్ ప్రయాణించిన బీఎండబ్ల్యూ ఎక్స్ 5 మోడల్ కారు నంబర్ టీఎన్ 06 ఆర్ 9297 కాగా, ఈ కారు రజనీకాంత్ పేరు మీద ఉంది. చెన్నై సౌత్ ఈస్ట్లోని మందవేలి ఆర్టీఓ కార్యాలయంలో ఆగస్టు 4, 2016న రిజిస్ట్రేషన్ అయింది. ఈ కారు ఇన్స్యూరెన్స్ గడువు ఆగస్టు 02, 2021లోనే పూర్తయినా ఇప్పటివరకు రెన్యువల్ కాలేదని రవాణాశాఖ వెబ్సైట్లో చూపిస్తోంది. అయితే కోట్లాది రూపాయలు ఉన్న రజనీకాంత్ ఇప్పటి వరకు ఎందుకు ఇన్సూరెన్స్ చేయలేదు, 16 నెలలుగా ఇన్స్యూరెన్స్ లేకుండానే ఆ కారు రోడ్లపై పురుగులు తీస్తుంటే చెన్నై ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. రూల్స్ సామాన్యులకేనా.. సెలబ్రెటీలకు వర్తించవా? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక రజనీకాంత్ కొత్త చిత్రం ‘లాల్ సలామ్’ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్యాత్మిక పర్యటన పెట్టుకున్నట్టు తెలిసింది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…