Rajamouli : ఆస్కార్ ఈవెంట్ ఎంట్రీ కోస‌మే రాజ‌మౌళి అన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టాడా..?

Rajamouli : 95వ ఆస్కార్ వేడుక‌లు ఇటీవ‌ల అట్ట‌హాసంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సారి ఆస్కార్‌లో నాటు నాటు మెరిసి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కి ఆస్కార్ వ‌చ్చిన నేప‌థ్యంలో దేశ‌మంతా గ‌ర్వంతో ఉప్పొంగిపోతుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్ష‌కులు మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా, నాటు నాటు పాట‌కు గాను బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ కీర‌వాణి, లిరిసిస్ట్ చంద్ర‌బోస్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. కాగా ఈ ఆస్కార్ ఈవెంట్‌లో కీర‌వాణి, చంద్ర‌బోస్‌తో పాటు ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, వారి కుటుంబ‌స‌భ్యులు కూడా పాల్గొన్నారు.

అయితే ఆస్కార్ వేడుక‌ల్లో పాల్గొన్న ఆర్ఆర్ఆర్ టీమ్ వేర్వేరుగా ఇండియాకు తిరిగివ‌చ్చారు. మార్చి 15న ఎన్టీఆర్ ఇండియాకు రాగా రాజ‌మౌళితో పాటు అత‌డి ఫ్యామిలీ మెంబ‌ర్స్ శుక్ర‌వారం ఇండియా చేరుకున్నారు. రామ్‌చ‌ర‌ణ్ కూడా శుక్ర‌వార‌మే ఇండియాకు వ‌చ్చాడు. అయితే ఆస్కార్ లైవ్ ఈవెంట్‌లో పాల్గొన‌డానికి రాజ‌మౌళి భారీగానే ఖ‌ర్చుచేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా విన్న‌ర్స్‌కు మాత్ర‌మే ఆస్కార్ లైవ్ ఈవెంట్‌లో టికెట్స్ కొనుగోలు చేయ‌కుండా పాల్గొన‌డానికి అవ‌కాశం ఉంటుంది. వారితో పాటు ఒక ఫ్యామిలీ మెంబ‌ర్‌ను మాత్ర‌మే ఉచితంగా వేడుక‌ను వీక్షించ‌డానికి అనుమ‌తి ఇస్తారు.

Rajamouli spent crores of rupees for Oscars entry
Rajamouli

మిగిలిన వారు ఆస్కార్ ఈవెంట్‌ను లైవ్‌గా వీక్షించాలంటే టికెట్ కొనాల్సిందే. ఈ ఏడాది ఒక్కో టికెట్ ధ‌ర‌ను ఇర‌వై ల‌క్ష‌ల అర‌వై వేలుగా ఫిక్స్ చేయ‌గా, రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు మిగిలిన వారంద‌రూ టికెట్స్ కొనుగోలు చేసి ఈ ఈవెంట్‌కి హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది. ఆస్కార్ ఈవెంట్ టికెట్స్ కోసం రాజ‌మౌళి దాదాపు కోటి న‌ల‌భై ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చుచేసిన‌ట్లు స‌మాచారం. అది పెద్ద మొత్త‌మే అయినా త‌మ సినిమాకు అవార్డును ప్ర‌క‌టించే క్ష‌ణాల‌ను ప్ర‌త్య‌క్షంగా ఆనందించ‌డం కోసం రాజ‌మౌళి అంత ఖ‌ర్చు చేశాడ‌ని అంటున్నారు. ఆ మ‌ధ్య త‌మ్మారెడ్డి కూడా ఆస్కార్ కోసం చేస్తున్న ఖ‌ర్చుపై విమ‌ర్శ‌లు కురిపించిన విష‌యం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago