Raghurama Krishnam Raju : వివేకా హత్యపై రఘురామ‌కృష్ణంరాజు సంచ‌ల‌న కామెంట్స్.. భార‌తీ రెడ్డి వాట్సాప్ చాట్ బ‌య‌టపెట్టేశాడుగా..!

Raghurama Krishnam Raju : వైఎస్ వివేకా హ‌త్య కేసు ఏపీ రాజ‌కీయాల‌లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. ఆయ‌న చనిపోయి చాలా రోజులు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ ఆయ‌న మ‌ర‌ణం వెన‌క మిస్ట‌రీ ఏంట‌నేది బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఇటీవ‌ల వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయన కూతురు సునీత సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్లను ఆమె ప్రస్తావించడం సంచలనం రేపుతోంది. తన ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి తనకు ఫోన్ చేశారని… తాను కడప, సైబరాబాద్ కమిషనరేట్లకు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానని సునీత తెలిపారు.

ఎక్కువ సమయం తీసుకోనని చెప్పిన భారతి వెంటనే తన ఇంటికి వచ్చారని చెప్పారు. అయితే ఆమెతో పాటు విజయమ్మ, వైఎస్ అనిల్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రావడంతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. లిఫ్ట్ వద్దే భారతితో తాను మాట్లాడానని, ఆ సమయంలో భారతి చాలా ఆందోళనగా కనిపించారని చెప్పారు. ఇక వివేక హత్య కేసు లో సీబీఐ ఛార్జిషీట్‌లో అనేక అంశాలు ఉన్నాయని, ఈ కేసులో సీబీఐ చేతులు ఎత్తేశారాని సాక్షిలో రాసుకున్నారని, ఐ ఏమో ఓ యాప్ ద్వారా మెసేజ్ చేసినట్టు ఉందని క్లియర్‌గా అందులో రాశారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

Raghurama Krishnam Raju revealed bharati reddy whatsapp chat
Raghurama Krishnam Raju

వివేకానంద రెడ్డితో రాయించిన లేఖ ముందు ఎవరు పెట్టారో దాని వేలిముద్రలు కూడా ఉంటాయని, వాటిపై సీబీఐ ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్నారన్నారు. వివేకా హత్య ఆస్తి కోసం కాదని.., కేవలం రాజకీయ హత్య అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. లోకేష్ కు హక్కు ఉందని, ఆయన అడగవచ్చునని.. ఎందుకంటే వారి కుటుంబం నారసురా రక్త చరిత్ర అని వైసీపీ వాళ్ళు వేశారన్నారు. అవినాష్ రెడ్డి 6.30 గంటలకు జగన్ పీఏకు ఫోన్ చేసి వివేకానంద రెడ్డి చనిపోయారని చెపితే… సాక్షిలో గుండెపోటు కథనాలు ఎందుకు వచ్చాయి?.. విజయసాయిరెడ్డి ఏడుపు మొఖం పెట్టి వివేక గుండెపోటుతో చనిపోయారని ఎలా చెప్పారని ప్రశ్నించారు. ర‌క్తపు మ‌డుగులో ఉన్న వ్య‌క్తిని గుండెపోటుగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం ఎందుకు చేశారు. అలానే తాను కొన్ని ప‌త్రాలు చూపించి ప్రశ్నల వర్షం కురిపించాడు.

Share
Shreyan Ch

Recent Posts

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 hours ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

23 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago