ప్రస్తుతం ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్ట్స్లో నటిస్తుండగా , వాటిలో ఆదిపురుష్ చిత్రం ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రామాయణ ఇతిహాస కావ్యం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు.
మోస్ట్ అవేటింగ్ మూవీగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఇది చాలా నెగెటివిటీ తెచ్చుకుంది. ఓవైపు ఈ సినిమాలో వీఎఫెక్స్ బాగాలేదంటూ, మరోవైపు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వివాదాలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీజర్లో మొత్తం బొమ్మలనే చూపించాడంటూ దర్శకుడు ఓం రౌత్ని విమర్శించారు. గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉందంటూ ఏకిపారేశారు.ఈ క్రమంలో చిత్రంపై మరింత వర్క్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావించారట. ఈ క్రమంలో మూవీని కొద్ది రోజులు వాయిదా వేయాలని అనుకున్నారట.
మరోవైపు సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహా రెడ్డి, అఖిల్ ఏజెంట్ చిత్రాలు తెలుగులో విడుదల కానుండగా, తమిళంలో విజయ్, అజిత్ చిత్రాలు రెండూ రిలీజ్ అవుతున్నాయి. అక్కడ థియేటర్స్ దొరకటం చాలా కష్టం. దీంతో అక్కడ థియేటర్స్ దొరకడం చాలా కష్టం. ఈ క్రమంలో సినిమాని కొద్ది రోజులు వాయిదా వేసి, సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…