Samantha : అందంతో పాటు అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది సమంత. ఎప్పుడు చలాకీగా ఉండే సమంతకి మయోసైటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి నిర్ధరణ అయినట్లు పేర్కొంది. దీంతో సమంత ఆ వ్యాధి బారిన ఎలా పడిందని ఆరా తీస్తున్నారు ఆమె ఫ్యాన్స్. సమంత ఈ వ్యాధి బారిన పడడానికి కారణం హెవీ వర్కవుట్స్ అని కూడా అంటున్నారు. వంద కేజీల వరకు ఆమె బరువులు మోసింది. అంతేకాదు యశోద, వరుణ్ ధావన్ వెబ్ సిరీస్, ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం భారీ వర్కవుట్స్ చేసింది. ఆ వీడియోలు కూడా సామ్ పోస్టుచేసింది. మరోవైపు నాగ చైతన్య విడాకుల తర్వాత డిప్రెషన్కి వెళ్లింది సమంత.
ఇవన్నీ సమంత ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపించి ఉంటాయని అంటున్నారు. ఆటో ఇమ్యూన్ కారణంగా శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను మయోసైటిస్ అని పిలుస్తుంటారు. దీని వల్ల కండరాలు బలహీనంగా మారడమే కాకుండా త్వరగా అలసట రావడం, నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాస్తవానికి సమంతకు 2013లోనే డయాబెటిక్ వచ్చింది. అప్పటినుంచి ఆమె ఆహారం విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. దీని వల్ల డయాబెటిక్ కంట్రోల్లో ఉంది. కాని ఇప్పుడు మయెసైటిస్ అనే వ్యాధి సమంతకు రావడంతో ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ వ్యాధి వలన అరి కాళ్ల నుంచి పిరుదుల వరకు కండరాలు బాగా నొప్పి పెడతాయట.
ఎన్నో ఒడిదుడుకులని తట్టుకుని ముందుకు సాగతున్న సమంతకు మయోసైటిస్ అనే వ్యాధి సోకడం ప్రతి ఒక్కరిని బాధకు గురి చేస్తుంది. మరోవైపు సమంతకు వచ్చిన అనారోగం గురించి తెలుసుకొని.. ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలోపోస్టులు పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి… సామ్ త్వరగా కోలుకోవలంటూ ట్వీట్ చేశారు . అఖిల్, సుశాంత్, కాజల్, సాయిపల్లవి నాని వంటి సెలబ్రిటీలతో సమంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే సమంత కొన్ని ఏళ్ల నుంచి వివిధ రకాల వ్యాధులతో బాధపడే వారికి అండగా ఉండేందుకు ప్రత్యూష అనే ఎన్ జీ వో ను నడుపుతున్న విషయం తెలిసిందే.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…