Posani Krishnamurali : ఇప్పుడు ఏపీ రాజకీయాలు మంచి హీట్ మీదున్నాయి. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, జైలుకు వెళ్లిన తరువాత రాజకీయం మరింత హీటెక్కింది. అధికార పార్టీ నేతలు చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అవినీతి చక్రవర్తి అయిన చంద్రబాబు పాపం పడిందని, ఇక ఆయన జీవితాంతం జైల్లోనే ఉంటాడంటూ వైసీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తుండగా, ఈ సింపతీ చంద్రబాబుకి బాగా వర్కవుట్ అవుతుందని మరికొందరు అంటున్నారు. అయితే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండి కూడా ప్రజలు, రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నారని ఆమె తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సెలవులో వెళ్లడంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడుతూ.. రామోజీ రావు ఆయన పేపర్తో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ భార్య చనిపోతే రాజకీయం చేస్తారా? అని ప్రశ్నించారు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఆయన భార్యకు అనారోగ్యంగా ఉండటంతోనే సెలవుపై వెళ్లారని చెప్పారు. రామోజీరావు చనిపోతే అతని కుమారుడు కిరణ్ వెళ్లడా? అని ప్రశ్నించారు. రాహుల్ సెలవుపై వెళ్లడంతో జైలుకుకొత్త అధికారి వస్తే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బంధువు అని.. అతనిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబును జైలులో కలిసిన ఆయన సతీమణి భువనేశ్వరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె భర్త ప్రజల కోసమే పనిచేశారని చెప్పారని అన్నారు. అయితే చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరింది ప్రజల కోసమేనా?, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు డబ్బులు పంపింది ప్రజల కోసమేనా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్పై చెప్పుల దాడి చేయించింది, అక్రమంగా అధికారం లాక్కుంది చంద్రబాబు అని గుర్తులేదా? అని ప్రశ్నించారు. నందమూరి బాలకృష్ణ ఇద్దరిని పిట్టలు కాల్చినట్టుగా కాల్చిపారేశాడని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. వారు బుల్లెట్స్ దిగి చావు బతుకుల్లో ఆస్పత్రిలో ఉంటే.. పోలీసు స్టేషన్లో ఉండాల్సిన బాలకృష్ణ.. కానీ బాలకృష్ణకు ఎందుకు శిక్ష పడలేదని ప్రశ్నించారు. మీనాన్న ను వెన్నుపోటు పొడిచింది ప్రజల కోసమేనా అని ప్రశ్నించారు పోసాని. ఎన్టీఆర్ పదవీని చంద్రబాబు అక్రమంగా లాక్కున్నారని.. ఎన్టీఆర్ పై చెప్పులతో చేయించింది కూడా చంద్రబాబే అన్నారు. ఈ విషయాలు నారా భువనేశ్వరికి గుర్తుకు లేవా అని నిలదీశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…