టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఒక్కడు’ చిత్రం అప్పటికి ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసి మహేశ్ సినీ కెరీర్ లో నే బెస్ట్ మూవీగా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేయగా, ఈ మూవీ లోని యాక్షన్ సీక్వెన్సెస్, మహేశ్, భూమిక, ప్రకాశ్ రాజ్ ల మధ్య సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇకపోతే ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం కామెడీ ఎపిసోడ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కాగా, ఆ సీన్ లో ధర్మ వరపు తన ఫోన్ నెంబర్ 98480 32919 అని చెప్తుంటాడు. ఆ నెంబర్ ఎవరిది? ఆ సీన్ లో ఆ నెంబరే ఎందుకు పెట్టారు? అనే సంగతుల గురించి మీకు తెలుసా?
ఒక్కడు చిత్రంలో చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పనిచేస్తుంటారు. పాస్ పోర్ట్ కోసం మహేష్ బాబు అతడిని టార్చర్ పెట్టే సన్నివేశం అద్భుతంగా పండింది. కొత్తగా మొబైల్ ఫోన్ కొన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. తన ప్రియురాలికి నంబర్ చెబుతాడు. మొట్టమొదటిసారి ఈ ఫోన్ కు నువ్వే ఫోన్ చేయాలని కోరగా, ఆ నంబర్ ని మహేష్ గ్యాంగ్ వినడం.. పాస్ పోర్ట్ కోసం టోనీ అనే పేరుతో అతడిని విసిగించడం ప్రేక్షకులకి ఎంతో సరదాగా అనిపించింది. అయితే ఆ ఫోన్ నంబర్ ఎవరి నంబర్ ఉపయోగిద్దాం అని అనుకుంటుండగా.. ఎవరిదో ఎందుకు.. నిర్మాత నంబరే వాడేద్దాం అని ఎవరో సలహా ఇచ్చారట.
దీనితో అదే నంబర్ ని ఉపయోగించారు. సినిమా విడుదలయ్యాక ఆ నంబర్ కు కొన్ని లక్షల కాల్స్ వెళ్లాయట. దీనితో నిర్మాత ఎంఎస్ రాజు నిజంగానే ఫోన్ నంబర్ మార్చేసుకున్నారు. చాలా మంది ఆ టైంలో ఈ నెంబర్ అసలు రింగ్ అవుతుందా? లేదా ? అని ప్రతీ రోజు ట్రై చేసేవారట. ఇది ఆ ఫోన్ నెంబర్ వెనుక ఉన్న అసలు కథ. కాగా, మురారి సినిమాతో అప్పటికే గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబుకి ఒక్కడు సినిమాతో స్టార్ డమ్ వచ్చింది. ఈ చిత్రం అప్పట్లో సంచలన రికార్డులు తిరగరాసింది. ఏకంగా 100 సెంటర్లకు పైగా వంద రోజులు ఆడింది. గుణశేఖర్ కూడా ఒక్కడు సినిమాతో స్టార్ డైరెక్ట్రర్ అయిపోయాడు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…