Pawan Kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడంతో పాటుగా.. అవతలి పక్షాలపై విమర్శలు సంధిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీలకు ఉన్న ప్రధాన ఆయుధం ప్రకటనలు. ఓ వైపు మైకులతో ప్రచారం హోరెత్తిస్తూనే.. మరోవైపు పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఓటర్ల మనసు గెలుచుకునేందుకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పొలిటికల్ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.’ఫ్యాన్’ గాలికి కొట్టుకుపోతున్న ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టే బాధ్యతను “గాజు గ్లాసు” తీసుకుందనే విషయాన్ని ఈ యాడ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
జనసేన ఆవిర్భవ సందర్భంగా విడుదలైన ఆ పార్టీ పొలిటికల్ యాడ్ పై సెటైర్లు పేలుతున్నాయి. ఈ యాడ్ లో పవన్ పిచ్చ కామెడీ చేశాడని టాక్ వినిపిస్తోంది.జనసేన పార్టీ ఆవిర్భవ సందర్భంగా ఓ యాడ్ ను ఆ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ పొలిటికల్ యాడ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఆ యాడ్ చూసినట్లు అయితే ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టే బాధ్యతను “గాజు గ్లాసు” తీసుకుందనే విషయాన్ని ఈ యాడ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే యాడ్ పై సెటైర్లు పేలుతున్నాయి.
జగన్ మాట్లాడిన మాటలతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ గుర్తు ఉన్న వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిందని సింబాలిక్గా తెలిపిలే.. ఫ్యాన్ స్విచ్ ఆన్ ఆన్ చేస్తారు. ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న పేపర్లు ఒక్కొక్కటిగా ఎగిరిపోతుంటాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి.. నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన పేపర్లను తీసి టేబుల్ మీద సర్దుతారు. ఆ పేపర్లపై “గాజు గ్లాసు” ఉంచుతారు. రాష్ట్రాభివృద్ధిని తాము చక్కదిద్దుతామనే విషయాన్ని పార్టీల సింబల్ ద్వారా ఇలా తెలియజెప్పేందు ప్రయత్నం చేశారు. ఫ్యాన్ గుర్తు ఉన్న వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిందని సింబాలిక్గా తెలిపేలా.. ఫ్యాన్ స్విచ్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న పేపర్లు ఒక్కొక్కటిగా ఎగిరిపోతుంటాయి అంటే దాని ద్వారా ఏం చెప్పబోతున్నారని అందరిలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…