Pawan Kalyan : ఊహించిందే జరిగింది. జనసేన సీనియర్ నాయకుడు, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. పార్టీకి గుడ్బై చెబుతూ.. రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు. సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. టీడీపీ, జనసేన పొత్తు ఉన్నా సరే.. నెల్లూరు సిటీ నుంచి మాజీ మంత్రి నారాయణ పోటీ చేయడం ఖాయమనే వార్తలతో వినోద్ రెడ్డి జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. 2003లో విద్యార్థి నేతగా కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణం మొదలైందని, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం తనకు ఉందని గుర్తు చేశారు.
ఆనం వివేకానందరెడ్డి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ను వీడానని, యువతకు ప్రాధాన్యత కల్పిస్తానంటూ నమ్మించిన పవన్ కళ్యాణ్ ప్రసంగాల పట్ల ఆకర్షితుడినై జనసేన పార్టీలో చేరానని చెప్పారు. పార్టీలో చేరినప్పటి నుంచి నిబద్ధత గల జనసైనికుడిగా పనిచేశానని, జనసేన జనంలోకి తీసుకెళ్లానని కేతంరెడ్డి చెప్పారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని పవన్ కల్యాణ్ కల్పించారని వివరించారు. ఆ ఎన్నికల్లో ఓడినప్పటికీ.. ఏనాడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని, పార్టీ కోసం నిత్యశ్రామికుడిలా కృషి చేశానని అన్నారు.
2016లో తాను సేవ్ నెల్లూరు అంటూ పోరాటం చేసిందే ఈ నారాయణ అక్రమాల మీదేనని, అలాంటి వ్యక్తిని గెలిపించడానికి తాను పనిచేయలేనని తేల్చి చెప్పారు కేంతరెడ్డి. 2019 ఎన్నికల్లో ప్రత్యర్థిగా నారాయణ అక్రమాల మీద బలంగా తన గళాన్ని వినిపించానని చెప్పారు. ఇన్ని రోజులు పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా ఆత్మాభిమానాన్ని చంపుకొని పని చేశానంటే అది పవన్ కళ్యాణ్ ఉన్నారనే ధైర్యంతోనేనని అన్నారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో అవమానాలను భరిస్తూ ఉండలేనని, ఓర్పు, సహనం నశించిందని, మనస్సు చచ్చిపోయిందని కేతంరెడ్డి వాపోయారు. అయితే ఆయన సడెన్గా ఇలా పార్టీకి గుడ్ బై చెప్పి బయటకు రావడం పట్ల పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. కేతంరెడ్డి పని చేస్తాడని అనుకున్నా. కాని ఎందుకో ఆన బయటకు వెళతాడని అనిపించింది. అదే చేశాడని పేర్కొన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…