Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయాలపై పూర్తి దృష్టి పెట్టారు. ఆయన సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. చంద్రబాబుతో పొత్తుల విషయం గురించి ఓపెన్గా చెప్పుకొచ్చిన జనసేనాని తాను చనిపోవడానికి సిద్ధమై పార్టీ పెట్టినట్లు పవన్ అన్నారు. 2014లో పార్టీ పెట్టినప్పుడు తన పక్కన ఎవరూ లేరని, తాను ఒక్కడినే ఉన్నా అన్నారు. మరణానికి సిద్ధపడే ఆ రోజు పార్టీ పెట్టానని, ఈ రోజు సత్యాన్ని ఆవిష్కరింపజేస్తున్నా అని అన్నారు. ఈ పోరాటంలో తనను పంచేసినా పర్లేదని, చైతన్యం లేకుండా పిరికితనంతో ఉన్న తెలుగుజాతిని మేల్కొలపడానికి తెగిస్తానని ఆయన అన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న ఓ పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని, సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని చెప్పారు.
తాను ఎప్పుడు భారతీయుడిగానే మాట్లాడుతానని, 389 మంది మేధోమథనం చేయడం వల్ల మన రాజ్యాంగం వచ్చిందని తెలియజేశారు. రాజ్యాంగాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని, సనాతన ధర్మం, తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోందని పవన్ చెప్పుకొచ్చారు. కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందని, ద్వేషం, దోపిడీ కొంతకాలమే ఉంటాయని అన్నారు. ధ్వేషంతో కూడిన వాదనలు కచ్చితంగా కనుమరుగవుతాయని, మార్పును అంగీకరించి, ధర్మాన్ని పాటించి ప్రేమతో ముందుకొచ్చే వ్యక్తులే సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతారని అభిప్రాయపడ్డారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్లే దేశంలో ఏకత్వం నిలబడింది.
సీఎం జగన్ కు అదో రకమైన మానసిక సమస్య ఉందని, దాన్ని పిచ్చి అంటారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మెడికల్ టీమ్ ను ఏపీకి పంపించి జగన్ను చెక్ చేయాలని కేంద్రాన్ని కోరతానని చెప్పారు. ఏదైనా ప్రశ్న అడిగితే, చేతిలో పేపర్ లేకపోతే సరిగ్గా సమాధానం చెప్పలేని వ్యక్తి జగన్ అని, మానసిక పరిస్థితి సరిగ్గా లేని అలాంటి వ్యక్తులు పరిపాలన చేయడానికి అనర్హులు అవుతారని భారత రాజ్యాంగంలోనే పేర్కొన్నారంటూ పవన్ సంచలనానికి తెరతీశారు. ఏపీని ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం కరెక్ట్ కాదంటూ పవన్ పేర్కొన్నారు. ముందు జగన్ని ఏపీ నుండి తరిమేసి ఆ తర్వాత ఎవరు సీఎం, ఏఏ పదవులు దక్కించుకోవాలి అనే దానిపై చర్చలు జరుపుతామని పవన్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…