Ambati Rambabu : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఏ రేంజ్లో సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, జైలు అంశాలపై ఏపీ, తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం మనం చూశాం. అయితే తాజాగా చంద్రబాబు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో వచ్చిన ఐటీ, ఇతర పరిశ్రమలతో ఉపాధి పొందిన యువత కూడా బాబుకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించేందుకు వెళ్లిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు.. బాబు మద్దతు దారుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేటకు మంత్రి అంబటి రాంబాబు శుక్రవారం ఉదయం వెళ్లారు.
పోలీసుల రక్షణలో ఆయన కాన్వాయ్తో సహా వెళ్లినా.. మార్గమధ్యంలో అంబటి రాకను గుర్తించిన టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అంబటి ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలంటూ.. యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో కాన్వాయ్ను పక్కగా ఆపించిన అంబటి.. యువతతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే, చంద్ర బాబు అరెస్టుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువత వైసీపీ ప్రభుత్వాన్ని, మంత్రి అంబటిని దూషించారు. తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో కొద్దిసేపు అంబటి అలానే రోడ్డుపైనే నిలబడిపోయి చూస్తుండిపోయారు.
ముఖ్యంగా అంటిని అయితే.. యువత మాత్రం కాన్వాయ్ను నిలువరించే ప్రయత్నం చేశారు. జై బాబు నినాదాలతో హోరెత్తించారు. అదేసమయంలో మరికొందరు డౌన్ డౌన్.. సీఎం జగన్ నినాదాలు చేశారు. అంబటి హోటల్ బయటికి వచ్చి కారులో ఎక్కుతున్న సమయంలో టీడీపీ మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు టీడీపీ యువనేత నారా లోకేశ్ ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. “కులోన్మాదంతో దాడి చేయాలనుకుంటే నాకూ ఓ కులం ఉంది… గుర్తుపెట్టుకోండి” అంటూ హెచ్చరించారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…