Pawan Kalyan : 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ప్రజల దృష్టిని ఆకర్షించారు రాపాక.అయితే కొన్నాళ్లు జనసేనలో యాక్టివ్ గా ఉన్న ఆయన తరువాత మెల్లగా అధికార వైసీపీకి దగ్గరవుతూ వచ్చారు. జనసేన కూడా రాపాకను పట్టించుకోకపోవడంతో ఆయన వైసీపీ గూటికి చేరి రాజోలు నియోజిక వర్గ వైసీపీ ఇంచార్జీగా బాద్యతలు చేపట్టారు. ఇక అప్పటి నుండి ఆయన జగన్ పాలనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఓ సందర్భంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్గా మారాయి.
తాను దొంగ ఓట్లతో గెలిచానని, రాజోలులో తన గెలుపుకు దొంగ ఒట్లే కారణం అని, తన స్వగ్రామం చింతలమోరి నుంచి 10 నుంచి 20 మంది వచ్చి ఒక్కొక్కరూ ఐదు ఓట్ల చొప్పున దొంగ ఓట్లు వేసేవారని రాపాక ఆ మద్య సంచలన కామెంట్స్ చేశారు. రాపాక వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్రార్ధకంగా కూడా మారింది. అయితే మలికిపురం లో వారాహియాత్ర బహిరంగ సభలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తమ పార్టీ తో గెలిచి ప్రజలకు అవసరమైన పనులు చేయకపోతే ప్రశ్నిస్తానని అన్నారు పవన్ కళ్యాణ్. మా ఓటు బోటు మీద గెలిచి ప్రజలని మోసం చేస్తే వారు సహించరని చెప్పుకొచ్చారు.
2019 ఎన్నికల ఓటమి మా గుండెకి పెద్ద గాయం చేసింది. ఆ గాయం రాజోలు గెలుపు కాస్త ఉపశమనం ఇచ్చింది. అయితే గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా మా నిర్ణయం తీసుకోకుండా వేరే పార్టీకి వెళ్లడం ఎంత వరకు కరెక్ట్. ఇది ప్రజలు అస్సలు సహించరు అని పవన్ అన్నాడు. అంతేకాకుండా తాను పార్టీ పెట్టినప్పుడు 150 మంది సభ్యులు ఉన్నారని చెప్పిన పవన్ ఇప్పుడు ఒక్క రోజులలో పదివేలకి పైగా కార్యకర్తలు ఉన్నారని తెలియజేశాడు. రోజు రోజుకి జనసేన పార్టీ ఎదుగుదల కనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…