మొబైల్స్ తయారీదారు ఒప్పో భారత మార్కెట్లో మరో నూతన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. రెనో 8 ప్రొ పేరిట విడుదలైన ఈ ఫోన్లో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఇందులో 6.7 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్లో 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. 256 జీబీ స్టోరేజ్ను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్ను అందిస్తున్నారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. 5జి, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను ఈ ఫోన్లో పొందవచ్చు. దీంట్లో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను అందిస్తున్నారు.
ఇక ఒప్పో రెనో 8 ప్రొ స్మార్ట్ ఫోన్ గ్లేజ్డ్ గ్రీన్, గ్లేజ్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా.. దీన్ని రూ.45,999 ధరకు విక్రయిస్తున్నారు. ఫ్లిప్కార్ట్తోపాటు ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్లో, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్లో ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. దీనిపై పలు బ్యాంకులకు చెందిన కార్డులతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ను, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…