YS Sharmila : రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత నామ రూపాలు లేకుండా పోయింది.1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో అధికార పక్షమో, ప్రతిపక్షంగానో ఉంటూ వచ్చిన పార్టీ 2014 నాటికి అసెంబ్లీలో కనిపించకుండా పోయింది. ఒక్క సీటు దక్కలేదు. అంతేకాదు 2014, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తుంది. పార్టీని నిర్మాణ పరంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మహిళ చేతికి కాంగ్రెస్ నాయకత్వం పదవి ఇచ్చింది. వైఎస్ షర్మిలకి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు అందించింది.
ఉమ్మడి ఏపీకి పీసీసీ ప్రెసిడెంట్ గా రెండు సార్లు పనిచేసిన వైఎస్సార్ తనయగా షర్మిల అదే హోదాలో పార్టీ పగ్గాలు అందుకోవడం ఒక విశేషంగా చెప్పాలి. ఇక ఏపీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు అందుకున్న తర్వాత షర్మిళ చుట్టూ పాత కాపులు క్యూ కడుతున్నారు. ఇటీవల షర్మిలతో కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి యాదవ్ షర్మిళతో భేటి అయ్యారు. ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో షర్మిల భర్త బ్రదర్ అనీల్ భేటీ అయిన విషయం తెలిసిందే. సీనియర్లలో మాజీ ఎంపీ హర్షకుమార్ లాంటి కొందరు షర్మిలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జేడీ శీలం, పళ్ళంరాజు లాంటి చాలామంది షర్మిలకు మద్దతుగా నిలబడ్డారు. కాంగ్రెస్ లో వైఎస్సార్ కి అండగా నిలిచిన వారు ఆయన నేస్తం కేవీపీ రామచంద్రరావు. ఆయన వైఎస్సార్ ని వెన్నంటి ఉండేవారు. వైఎస్సార్ ది గ్లామర్ అయితే కేవీపీది గ్రామర్ అని చెప్పుకునే వారు. ఇప్పుడు ఆయన షర్మిళ వెంట ఉండడం వివేషం.
వైఎస్కు ఒకప్పుడు బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళలో చాలామంది షర్మిల చుట్టూ చేరుతున్నట్లు అర్థమవుతోంది. 2009 తర్వాత పార్టీలో నుండి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేసినప్పుడు పైన చెప్పుకున్న సీనియర్లు ఎవరూ మద్దతుగా బయటకు రాలేదు. కాని ఇప్పుడు షర్మిళ అధ్యక్షురాలిగా నియమించబడ్డ తర్వాత బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.కేవీపీ ఇటీవల షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుకలో ఆయన వేదికపై కనిపించారు. ఇక షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్దకు వెళ్లే సమయంలో ఆమె వెంట ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పక్కనే ఉండే కేవీపీని ఆయన నీడగా అంతా చెప్పుకునే వారు. అంతే కాదు ఆయన వైఎస్సార్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ముఖ్య సలహాదారుగా కూడా పనిచేశారు. మొత్తానికి చూస్తే కనుక ఏపీలో కాంగ్రెస్ను పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో ఉన్న వైఎస్ షర్మిలకు కేవీపీ అనే కొండంత అండ దొరికినట్లు కనిపిస్తోంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…