నువ్వే కావాలి.. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2000లో బాక్సాఫీస్ ను షేక్ చేసిన సూపర్ హిట్ ఫిల్మ్. కె. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ మూవీలో తరుణ్ ప్రధాన పాత్రలో నటించగా.. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 2000 అక్టోబర్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రంగా నిలిచింది. నువ్వే కావాలి సినిమాలో తరుణ్ సరసన రిచా కథానాయికగా నటించింది.
రిచా ఈ మూవీ తర్వాత తెలుగు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది . అయితే చాలాకాలం వెండితెరపై సందడి చేసిన రిచా.. పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైంది. రిచా బెంగళూరులో పుట్టింది. అన్ని భాషలపై పట్టు సాధించింది. మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు అందుకుని తర్వాత సినిమా కెరీర్ లో నిలదొక్కుకోలేక పోయింది . సినిమా అవకాశాలు వచ్చినా అవి అంతగా హిట్ అవ్వలేదు.తమిళ్ స్టార్ హీరో విజయ్ తో షాజహాన్ అనే సినిమాలో నటించింది. కానీ అది కూడా ప్లాప్ అయ్యింది.
యష్ రాజ్ ఫిలిమ్స్ లో నీల్ అండ్ నిక్కీ అనే సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా పెద్దగా స్టార్ డం తీసుకురాలేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తమిళ్ రీమేక్ లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. కొన్నాళ్ల తర్వాత తెలుగులో ఇంకోసారి అనే సినిమాతో వచ్చింది. దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పి వివాహం చేసుకుంది. 2011లో రిచా హిమాన్షు బజార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. రిచా 2016లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత మళ్లీ 2020 వరకు రిచా మళ్లీ సినిమాలలో కనిపించలేదు. 2020లో యువర్ హానర్ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ లో కూడా రిచా నటించి మెప్పించింది.
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…