Niharika Konidela : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి తరచూ వార్తలు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. సమంత- నాగ చైతన్య జంట విడిపోయిన తర్వాత చాలా మంది సెలబ్స్ కూడా బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే కొన్నాళ్లుగా నిహారిక- చైతన్య కూడా విడిపోతున్నట్టు ప్రచారాలు నడుస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఈ ఇద్దరు రాజస్థాన్లోని ఉదయ్ పూర్ ప్యాలెస్లో చాలా గ్రాండ్గా వివాహం చేసుకున్నారు.ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా హాజరై సందడి చేసింది. అయితే రీసెంట్గా నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య మనస్పార్థాలు వచ్చాయని, దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
నిహారిక, చైతన్య ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. మెగా ఫ్యామిలీలో అందరినీ ఫాలో అవుతున్న చైతన్య.. నిహారికను మాత్రం అన్ఫాలో చేయడం ఆశ్చర్యకరంగా మారింది. అంతేకాదు, తమ పెళ్లి ఫొటోలను సైతం చైతన్య ఇన్స్టాగ్రామ్ నుంచి డిలీట్ చేశారు. నిహారికతో దిగిన ఒక్క ఫొటో కూడా ఇప్పుడు చైతన్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో లేదు. దీంతో నిహారిక, చైతన్య విడాకులు తీసుకోతున్నారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే నిహారిక మాత్రం తమ పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో అలానే ఉంచేసుకుంది.
ఇటీవల సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారానే విడాకుల విషయంపై హింట్ ఇస్తున్నారు. ఇప్పుడు వీరు కూడా ఇలా హింట్ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. మరి దీనిపై ఇప్పటివరకు అటు మెగా ఫ్యామిలీ కాని.. ఇటు జొన్నలగడ్డ ఫ్యామిలీ కాని అఫీషియల్ గా స్పందించలేదు . గతంలో నాగచైతన్య , సమంత ,ధనుష్ లాంటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారానే హింట్ ఇచ్చారు. నిజానికి నిహారిక, చైతన్యలది ప్రేమ వివాహం. 2020 డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ఒబెరాయ్ ఉదయ్ విలాస్లో అంగరంగ వైభవంగా వీరి వివాహ వేడుక జరిగింది. వీరిని మెగా ఫ్యామిలీలోనే చూడచక్కనైన జంట అని అంతా అన్నారు. చైతన్యను అయితే మెగా అభిమానులు ‘బావ బావ’ అంటూ ఆకాశానికి కూడా ఎత్తేశారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…