Niharika : సమంత- నాగ చైతన్య విడాకుల తర్వాత టాలీవుడ్ లో నిహారిక- చైతన్యల విడాకుల విషయం ఆ రేంజ్లో హాట్ టాపిక్ అయింది. గత కొన్ని నెలలుగా నిహారిక విడాకుల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నా నాగబాబుతో పాటు మరెవరు నోరు మెదపలేదు. నిహారిక-వెంకట చైతన్య సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలోచేసుకోవడం, వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు, నిహారికతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి తొలగించడం విడాకుల వార్తలకు కారణమైంది. అయితే అందరు ఊహించినట్టే జూలై 5న నిహారిక, చైతన్యలు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించిన షాక్ ఇచ్చారు.
అయితే అంతకముందు వెంకట చైతన్యతో నిహారిక విడిపోతున్నారని పదుల సంఖ్యలో కథనాలు వెలువడినప్పటికీ, ఇరు వర్గాల్లో ఎవరూ స్పందించలేదు. ముఖ్యంగా నాగబాబు ఎందుకు ఖండించడం లేదనే వాదన వినిపిస్తోంది. చిన్న చిన్న విషయాలకు కూడా క్షణాల్లో స్పందించి సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టే నాగబాబు మౌనానికి కారణం ఏంటనే? చర్చ మొదలైంది. నాగబాబు కూతురికి సప్పోర్ట్ చేస్తున్నారా? అనే చర్చ కూడా జరిగింది. విడాకుల విషయంలో చిరంజీవి కూడా కలుగజేసుకున్నారని. ఇద్దరికీ సర్ది చెప్పి విడాకుల ఆలోచన విరమింప చేయాలని చూసారని కూడా అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసిన కూడా వారు విడిపోవాలని డిసైడ్ అయ్యారు కాబట్టి డైవర్స్ తీసుకున్నారు.
నాగబాబు అతి గారాబం కూతురు విడాకులు తీసుకునేందుకు కారణమైందంటూ తన సన్నిహితుల దగ్గర నాగబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారణం తానేనంటూ ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఒక్కగానొక్క ఒక్క కూతురు అని చాలా గారాబంగా పెంచడం వల్లనే నిహారిక కనీసం అత్తగారింట్లో కూడా అడ్జెస్ట్ కాలేకపోయిందని, అందుకే విడాకులు తీసుకోవలసి వచ్చిందని పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం నిహారిక నటిగా, నిర్మాతగా రాణించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇటీవల డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని పలకరించగా, ఇది ఓ మోస్తారు విజయం సాధించింది.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…