Naresh : గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో నరేష్- పవిత్రా లోకేష్ గురించి తెగ కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఇదివరకే ఆయన మూడో భార్యకు సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలవగా, త్వరలోనే విడాకులు కూడా తీసుకుపోతున్నట్లు వివరణ ఇచ్చాడు. ఇక ఆ విషయంలో నిత్యం ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. పవిత్రకి లిప్ లాక్ ఇచ్చిన దగ్గర నుండి ఆయనపై మరింత ఎక్కువగా మీమ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో నరేష్ మరోసారి పోలీసులను ఆశ్రయించి సోషల్ మీడియాలో కొంతమంది తప్పుగా తనపై తప్పుడు వార్తలు ప్రచారాలు చేస్తున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు. మొన్నటి వరకు సినిమా షూటింగులతో బిజీగా ఉన్న నరేష్ శుక్రవారం రోజు హైదరాబాదులోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ ఇచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఫిల్మ్ క్రిటిక్స్ అంటే సినిమాల గురించి మాట్లాడాలని.. వ్యక్తిగత విషయాల గురించి వారికి ఏంపని అని ప్రశ్నించారు. కొందరు సినిమారంగానికి చెందిన వారు కూడా ఇబ్బంది పెట్టే విధంగా వేర్వేరు నెంబర్ల నుంచి కాల్స్ చేస్తూ వేధిస్తున్నారని, వీటిపై సైబర్క్రైమ్స్లో ఫిర్యాదు చేశానని, కోర్టులో కేసు వేశానని నరేష్ అన్నారు. అయితే గతంలో ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి దర్యాప్తు వివరాలు తెలుసుకోవడానికే వచ్చాడని ఏసీపీ తెలిపారు. కొత్తగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపారు. పవిత్రా లోకేష్ వ్యవహారంలో సోషల్ మీడియా ట్రోల్స్పై ఫిర్యాదుకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని సైబర్క్రైమ్స్ పోలీసులు కోరడంతో నరేష్ స్వయంగా వచ్చి ఇచ్చినట్టు తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్ 27వ తేదీన మొదట నరేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. పలు వెబ్ సైట్స్ అలాగే యూట్యూబ్ ఛానల్ పై కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చారు.. దాదాపు 15 యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్స్ కు ఇదివరకే నోటీసులు కూడా జారీ చేశారు. ఇక ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ట్రోల్స్ పై కూడా ఆయన సీరియస్ అవుతూ పోలీసులను ఆశ్రయించారు. ఇక కొన్ని వారాల క్రితం నరేష్ తన మాజీ భార్య రమ్య రఘుపతి నుంచి కూడా తనకు ప్రాణహాని ఉంది అని తనపై దాడి చేసేందుకు కూడా ఆమె ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన కొన్ని వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏదేమైన ఇటీవలి కాలంలో నరేష్, పవిత్రలు ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…