Nagababu : మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ తో వార్తలలో నిలుస్తుంటాడు. అయితే ఎప్పుడు ప్రత్యర్ధులపై విరుచుకుపడే నాగబాబు రీసెంట్గా తమ ఇంటి హీరోలు తనకు సినిమాలలో ఛాన్స్లు ఇవ్వడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా ఇంట్లో చాలా మంది హీరోలున్నారు. కానీ, నాకు ఎవరూ ఎప్పుడూ ఏ క్యారెక్టర్ ఇవ్వలేదు. ఫస్ట్ టైమ్ సుస్మిత నాకు అవకాశం ఇచ్చింది. అంటే ఇది రెండోది. ఇంకో వెబ్ సిరీస్లో కూడా అవకాశం ఇచ్చింది’ అని అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విష్ణు ప్రసాద్, సుస్మిత కొణిదెల దంపతులు నిర్మించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్బాబు’ ఈ నెల 18న విడుదల కానుండగా, ఇందులో తండ్రి పాత్రలో నటించారు నాగబాబు.
అయితే చిరంజీవి తమ్ముడి హోదాలో హీరో కావాలనుకున్న నాగబాబు అదృష్టం కలిసి రాక నిర్మాతగా మారాడు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆయన చేసిన చాలా సినిమాలు నిరాశపరిచాయి. చిరంజీవి చేసిన సినిమాలన్నీ ఫ్లాప్. ఆ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్, చరణ్, అల్లు అర్జున్ లను కూడా వదల్లేదు. చరణ్ హీరోగా నాగబాబు నిర్మించిన ఆరెంజ్ అయితే అతి పెద్ద డిజాస్టర్. ఆ మూవీ తెచ్చిన నష్టాలకు నాగబాబు జీవితం తలకిందులైంది. ఇక మెగా హీరోలకు నాగబాబు నుండి మరో బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. చిరంజీవి మూవీలో నాగబాబు ఉన్నాడంటే దాదాపు ప్లాప్. మృగరాజు, అంజితో పాటు పలు చిత్రాల్లో ఈ సెంటిమెంట్ నిజమైంది.
అయితే నాగబాబు ఇతర హీరోల సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నా మెగా హీరోల సినిమాలలో కనిపించడం అరుదు. ఇతర హీరోలు ఆయనకు వేషాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ కుటుంబంలో ఉన్న ఏడెనిమిది మంది హీరోలు ప్రతి మూవీలో ఒక వేషం ఇస్తే చాలు. ఫుల్ బిజీ అయిపోతాడు. కాని ఎందుకో నాగబాబు మెగా హీరోల సినిమాలలో కనిపించడు. ఇప్పుడు చిరంజీవి పెద్దమ్మాయి నిర్మించిన శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మంచి హిట్ కావాలని ఆయన ఇటీవల వేదికపై చెప్పుకొచ్చాడు. ఏదేమైన నాగబాబు చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…