Naresh : సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి టాలీవుడ్ ప్రియులని ఎంతగానో కలవరపరచింది. ఆరు దశాబ్దాలుగా 350 చిత్రాలకుపైగా నటించిన కృష్ణ ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేని స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇక కృష్ణ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలను హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించగా, అనంతరం మహేష్ బాబు తన తండ్రికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తుండటం తెలిసిందే.
కృష్ణ చనిపోయిన సమయంలో నరేష్ ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కృష్ణకి నివాళులు అర్పించేందుకు పలువురు ప్రముఖులు హాజరు కాగా, ఆ సమయంలో నరేష్ హడావిడి చేస్తూ అందరినీ అదేదో శుభ కార్యం అయినట్టు తనే వెళ్లి రిసీవ్ చేసుకునే విధానం పరిశ్రమలో ఎవరికీ నచ్చలేదు. నటి పవిత్రని కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కూర్చేపెట్టడం అలాగే కొంతమందికి ఆమెని పరిచయం చేయించటం కూడా కొంత ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ రోజు నరేష్ చాలా ఓవర్ యాక్ట్ చేసాడని ఒక నిర్మాత, దర్శకుడు చెప్పారు.
కృష్ణ గారి పార్థివ శరీరం ఎప్పుడయితే నరేష్ ఇంటి నుండి పద్మాలయ స్టూడియోస్ కి తెచ్చేసారో, ఇంకా అప్పటి నుండి నరేష్ కనిపించటం చాలా తగ్గింది. విజయవాడ కృష్ణా నదిలో కృష్ణ గారి అస్తికలు కలపడానికి వెళ్ళినప్పుడు కూడా నరేష్ ని తీసుకు వెళ్లలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు వచ్చి మహేష్ బాబు మరియు అతని సిస్టర్స్ తో మాట్లాడుతున్నప్పుడు నరేష్ మధ్యలో జోక్యం చేసుకోవటం ఆయనని సైలెంట్గా ఉండమని కేసీఆర్ కూడా చెప్పడం మనకు కనిపించింది. ఇంత వయస్సు వచ్చిన కూడా ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. విజయనిర్మల చనిపోయినప్పుడు కూడానరేష్ ఇలానే చేసి నవ్వుల పాలయ్యాడు. వయస్సు పెరుగుతుంది కాబట్టి కొంత హుందాగా ప్రవర్తించడం మంచిది అని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…