Samantha : ఎంతో చలాకీగా ఉండే సమంత ఇటీవల తనకు మయోసైటిస్ వ్యాధి సోకిందని ప్రకటించడంతో ఆమె గురించి నిత్యం వందల కొద్ది వార్తలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇటీవల కొందరు అయితే సమంత పరిస్థితి క్రిటికల్గా ఉందని కూడా అన్నారు. దానిపై ఇటీవల యశోద ప్రమోషన్స్ లో స్పందిస్తూ నేను ఇంకా చనిపోలేదు. బ్రతికే ఉన్నాను అని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా సమంత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాని ప్రచారం జరిగింది. ఈ వార్తలు చూడగానే.. సమంత అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆమె మేనేజర్.. అలాంటిదేమీ లేదని తెలపడంతో.. హమ్మయ్యా అనుకుంటూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
‘ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఆరోగ్యంగానే ఉన్నారు. ఎవరు పుట్టించారో తెలియదు కానీ.. వినిపిస్తున్న వార్తలు నిజం కాదు. దయచేసి ఎవరూ కంగారు పడకండి’’ అంటూ సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే సమంతకు బాగాలేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలని చూసి.. ‘ఆమె త్వరగా కోలుకోవాలి’ అంటూ అభిమానులతో పాటు.. కొందరు సెలబ్రిటీలు కూడా ట్వీట్స్ చేయడంతో ప్రస్తుతం సమంత పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. దీంతో సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఇదిలా ఉంటే సమంత కొద్ది రోజుల మందే అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. మయో సైటిస్ అనే అరుదైన వ్యాధితో ఆమె బాధపడుతున్నట్టు అక్టోబర్ చివరి వారంలో సమంత వెల్లడించింది. `యశోద` విడుదలకు ముందు ఈ విషయాన్ని చెప్పి కాస్త సింపథి కూడా కొట్టేసింది. ఈ క్రమంలో యశోద చిత్రం మంచి విజయం కూడా దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో ఆసుపత్రిని కించపరిచినట్టు కోర్ట్లో పిటీషన్ వేయడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ని ఆపాలంటూ సిటీ సివిల్ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు తదుపరి విచారణ జరుపనున్నట్టు తెలిపింది. సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కి `ఈవా`అనే పేరు పెట్టి, అందులో అక్రమాలు జరుగుతున్నట్టుగా సినిమాలో చూపించారు.దీంతో వారు తమ ప్రతిష్ట దెబ్బ తిన్నట్టుగా ఫీలై కోర్ట్లో పిటీషన్ వేశారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…