Nara Lokesh : ఈ రోజు ఏపీ స్పీకర్గా అయ్యన్నపాత్రుడు ఎన్నుకోబడ్డారు. ఆయన గురించి ప్రతి ఒక్కరు గొప్పగా మాట్లాడారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడని కొనియాడారు. 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్నపాత్రుడికి ఉందన్నారు. ఒకే పార్టీ.. ఒకే జెండా.. ప్రజల అజెండాగా ముందుకెళ్లిన నాయకుడు అయ్యన్నపాత్రుడని పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం కక్షకట్టిందని నారా లోకేష్ తెలిపారు.
అయ్యన్నపాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధించిందని లోకేష్ గుర్తు చేశారు. రాజకీయాలు చూస్తూ పెరిగిన వ్యక్తిని తానని.. గతంలో సభ ఎంతో హుందాగా జరిగేదన్నారు. గత ఐదేళ్లు శాసనసభపై గౌరవం తగ్గేలా వైసీపీ వ్యవహరించిందన్నారు. సభ సంప్రదాయాలను గౌరవించేలా.. సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులను గైడ్ చేయాలని స్పీకర్ను లోకేష్ కోరారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా.. సభలో ప్రతిపక్షం లేకపోయినా.. మనమే ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాలన్నారు. అయ్యన్నపాత్రుడిపై ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పోరాడారన్నారు. అయ్యన్నపాత్రుడి నుంచి నేర్చుకోవల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని నారా లోకేష్ అన్నారు.
ఆయనకు గతంలో క్షణికావేశం ఉండేదని.. ఇక ఆ అవకాశం లేకుండా పోయిందని నవ్వులు పూయించారు. 25 ఏళ్ల వయస్సులోనే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారని గుర్తు చేశారు. ఏడు సార్లు ఒక్క నియోజకవర్గం నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం గొప్పవిషయమన్నారు. తాను పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న పాత్రుడి సలహాలు తీసుకున్నానని గుర్తు చేశారు.ఇక తమకు పవన్ కల్యాణ్ ఎంతో సపోర్ట్ గా నిలిచారని, పవన్ అన్న తీసుకున్న నిర్ణయం, ఆయన చేసిన కృషి వలన ఈ రోజు నేను ఐటీ మినిస్టర్ అయ్యానంటూ నారా లోకేష్ తెలియజేశారు.
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…
గుంటూరు కారంతో చివరిగా పలకరించిన మహేష్ బాబు గత కొద్ది రోజులుగా రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో పాల్గొంటూ…