Nara Lokesh : మరి కొద్ది రోజులలో ఎలక్షన్స్ సమీపిస్తుండగా, చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగిస్తూనే ఉంది. టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి జగన్ ప్రభుత్వం వరుస షాకులు ఇస్తూనే ఉంది. ఇప్పటికే అనేక కేసుల్లో తలనొప్పి ఎదుర్కొంటున్న చంద్రబాబుకు తాజాగా మరొక కేసు ఇబ్బందిగా మారనుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది.చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ3 గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు మరొక కేసులో ఇరుక్కున్నట్టు అయింది.
ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. కేసులో చంద్రబాబు నాయుణ్ని A3గా చేర్చారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టుకు తెలిపారు. న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కోర్టు పిటిషన్ను అనుమతించింది. ఎఫ్ఐఆర్ నంబర్ – 18/2023తో కేసు నమోదైంది. ఏ1గా ఐఎస్ నరేష్, ఏ2గా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఏ3 గా చంద్రబాబు నాయుడి పేర్లు నమోదు చేశారు. చంద్రబాబుపై మరొక కేసు పెట్టడంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన తండ్రి చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు. కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డో, ప్రెసిడెంట్ మెడల్ బ్రదర్ అంటూ ఘాటుగా స్పందించారు. పిచ్చికి వాడుతున్నట్టే కక్ష సాధింపు ధోరణికి కూడా మందులు వాడాలని అన్నారు. ఇప్పటికే పిచ్చికి లండన్ మందులు వాడుతున్నట్టే… కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిదంటూ ఎద్దేవా చేసారు. జగన్ తెచ్చిన పిచ్చి మందుకి 35 లక్షల మంది వివిధ రోగాల బారిన పడ్డారు. 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మద్యపాన నిషేధం పేరుతో లక్షకోట్ల ప్రజాధనం లూటీ చేసిన జగన్ చంద్రబాబు గారి పై కేసు పెట్టడం వింతగా ఉంది. ఆరోగ్యం పాడైన ప్రతి ఒక్కరూ జగన్ మీద కేసు పెడితే 35 లక్షలు కేసులు పెట్టొచ్చు అని లోకేష్ పేర్కొన్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…