Nara Lokesh : అమెరికా పోలీసుల అదుపులో లోకేష్’ అన్న శీర్షికతో ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ వార్త చూసి ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ శ్రేణులలో అలజడి నెలకొంది. ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే..టీడీపీ నాయకులలో మాత్రం ఆందోళన ఓ రేంజ్లో ఉంది. అయితే అసలు ఇందులో ఎంత నిజం ఉంది, అనే దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. అది ఫేక్ న్యూస్..కావాలని కొంతమంది సృష్టించినదే తప్పిస్తే దాంట్లో వాస్తవం లేదని సమాధానపర్చుకుంటున్నారు. అసలు సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులను షేక్ చేస్తున్న ఆ వార్తా కథనం ఏమిటనే విషయంపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తుంది.
యువ గళం పాదయాత్ర ముగింపు తర్వాత లోకేష్ పెద్దగా కనిపించడం లేదు. అటు చంద్రబాబు ‘రా కదలి రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సభలు నిర్వహిస్తుండగా, దాదాపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ రాజకీయ కార్యక్రమాలేవీ కనిపించడం లేదు. దీంతో ఆయన అంతర్గత చర్చలు, వ్యూహాలకు పరిమితమవుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇటీవల పూర్తిగా కనిపించకపోయేసరికి లేనిపోని ప్రచారం ప్రారంభమైంది. యూఎస్ లో నిధుల సమీకరణలో భాగంగా.. హవాలా తరహాలో నగదును ఏపీకి తెచ్చి క్రమంలో యూఎస్ పోలీసులు లోకేష్ ను కస్టడీలోకి తీసుకున్నారని ప్రచారం ప్రారంభమైంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ఈ విషయాన్ని ట్రోల్ చేస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన కమ్మ ప్రముఖులు పార్టీకి భారీగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే లోకేష్ యూఎస్ వెళ్లి.. అక్కడి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారని ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని టిడిపి వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట లోకేష్ ను అబాసుపాలు చేయడానికి ఈ తరహా ప్రచారం చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. లోకేష్ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యారని.. ఇప్పటికే చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచార సభలు నిర్వహిస్తుండడంతో.. క్షేత్రస్థాయిలో నెట్వర్క్ నడుపుతున్నారని.. ఇది చూసి తట్టుకోలేక వైసీపీ ఈ తరహా ప్రచారానికి దిగిందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికైతే ఎన్నికల ముంగిట ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఎన్నెన్నో బయటకు వచ్చే అవకాశం ఉంది.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…