Nara Lokesh : ఈ సారి ఏపీ ఎన్నికలు చాలా రంజుగా మారాయి. ఒకవైపు వైసీపీ మరోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా, మరోవైపు కూటమి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. ఇక లోకేష్ తిరిగి యువగళం పాదయాత్ర చేపట్టగా, ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులపై నిప్పులు చెరుగుతున్నారు. సీఎం జగన్ రెడ్డి చేసిన తప్పులకు వదిలిపెట్టమని…చట్టపరిధిలో చర్యలు తప్పవని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల యువగళం సభలో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి వచ్చిందే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోనని ఉద్ఘాటించారు. మేలుకో ఆంధ్రుడా… ఎన్నాళ్లీ కుల, మతాలపేరుతో కుంపట్లు అని ప్రశ్నించారు. యూనిఫైడ్ పోర్టల్, జాబ్ నోటిఫికేషన్తో ఉద్యోగాలు భర్తీచేస్తామని హామీ ఇచ్చారు. ముస్లింలు తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని… గుండెల్లో పెట్టుకుంటామని మాటిచ్చారు. 2014-19 మధ్య రూ.1500కోట్లతో నంద్యాలను అభివృద్ధి చేశామని వివరించారు. తమ హయాంలో 10వేల టిడ్కో ఇళ్లు కట్టించామని.. అయినా 2019 ఎన్నికల్లో సండే ఎమ్మెల్యేని గెలిపించారని విమర్శలు గుప్పించారు. జిల్లాలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం, ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఫైర్ అయ్యారు.ప్రశాంతతకు మారుపేరైన నంద్యాలలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 15 హత్యలు జరిగాయని మండిపడ్డారు. కానిస్టేబుల్ సురేంద్రను తరిమి తరిమి చంపారని హెచ్చరించారు.
అయితే తిరుపతి జిల్లాలలోని చంద్రగిరి సమీపంలో ఉన్న అదరాల యువగళం సభలో నారా లోకేష్ మళ్లీ పప్పులో కాలేయడ చర్చనీయాంశం అయింది. లోకేష్ ఎప్పుడు తప్పులో కాలేస్తాడా అని వైసీపీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మరోసారి దొరికాడు. మార్చి 13న ఓటేయాలంటూ నారా లోకేష్ పిలుపునివ్వడంతో ఎన్నికలు మే 13న అయితే మార్చి 13న అంటావేంటి.. మళ్లీ దొరికిపోయావుగా.. ఎన్నికల తేదీనే తెలియకపోతే ఇంకా ఎలా గెలుస్తావు అంటూ అతనిని తెగ ట్రోల్ చేస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…