Nandamuri Family : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో రూ. 371 కోట్ల అవినీతికి పాల్పడ్డట్లుగా ఏపీ సీఐడీ ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నాయకులు కొన్ని చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ తీవ్రంగా విమర్శిస్తున్నాడు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ టీడీపీ నాయకులు దిమ్మతిరిగే సమాధానాలు ఇస్తూ.. మీరు అవినీతి చేసి జైలుకు వెళితే.. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించాలంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాన్ రామ్ ఇప్పటి వరకు స్పందించలేదు. సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్ట్ని ఖండించలేదు. ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని, కొంతమంది టీడీపీ నాయకులు ఎన్టీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే కొద్దిగకూడా సానుభూతి లేదా? అంటూ తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అవినీతి చేసి జైలుకు వెళ్తే.. యంగ్ టైగర్ ఎందుకు స్పందించాలి, అదీకాక గతంలో ఎన్నికల ప్రచారంలో వాడుకుని ఎన్టీఆర్ ను ఏవిధంగా పక్కన పెట్టారో మేం మర్చిపోలేదని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ని మీరు ఎలా ట్రీట్ చేశారో.. మేం చూస్తూనే ఉన్నాం, అలాంటప్పుడు మా హీరో ఈ వ్యవహారంలో ఎందుకు స్పందించాలి? అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. అవినీతి చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన బాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు సపోర్ట్ చేయాలి? అంటూ సోషల్ మీడియా వేదిగా టీడీపీ నాయకులను ఓ ఆటాడుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ మెుత్తం వ్యవహారంలో నందమూరి ఫ్యాన్స్ లో చీలిక ఏర్పడిందని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే మరి కొందరు ఎన్టీఆర్ డైరెక్ట్గా లోకేష్తో ఫోన్ లో మాట్లాడారని, తన సపోర్ట్ ఉంటుందని చెప్పినట్టు ప్రచారం చేస్తున్నారు.
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…