Nagarjuna : అక్కినేని నాగార్జున పెద్దగా వివాదాల జోలికి వెళ్లడు. కొన్నిసార్లు కావాలనే కొందరు వివాదాలలో నిలిచేలా చేస్తారు. బిగ్ బాస్ సమయంలో నాగార్జునని దారుణంగా విమర్శించడం మనం చూశాం. అయితే ఆ సమయంలో నాగార్జున స్పందించింది లేదు. ఇక ఇటీవల నాగార్జున బాడీగార్డ్ ఆయన అభిమానిని తోసేయడంతో కిందపడిపోయాడు. ఆ వీడియో వైరల్ కాగా, పెద్ద వివాదాస్పదం అయింద. అప్పుడు నాగార్జున క్షమాపణలు కూడా చెప్పాడు. నాగార్జున ముంబయి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తుండగా అనుకోని ఘటన జరిగింది. ఎయిర్పోర్ట్లో నాగార్జునతో పాటు ధనుష్ నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడే షాపులో పనిచేస్తున్న ఓ అభిమాని నాగ్ను కలిసేందుకు ముందుకు వచ్చాడు.
దీంతో ఆ అభిమాని వికలాంగుడు అని కూడా చూడకుండా సెక్యురిటీ గార్డ్ అతడిని గట్టిగా పక్కకు తోసేశాడు. కిందపడబోయిన అతడు తమాయించుకుని నిలబడ్డాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దీంతో మానవత్వం ఏమైపోయింది అంటూ నెటిజన్లు నాగార్జునను విమర్శించారు. అయితే ఈ వివాదం నాగ్ దృష్టికి కూడా వెళ్లింది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఇలాంటిది జరగకుండా ఉండాల్సింది. ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటాను అంటూ నాగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఇక తాజాగా ఆ అభిమానిని నాగార్జున డైరెక్టుగా కలిశారు. మళ్లీ క్షమాపణలు చెప్పారు. అలాగే హగ్ చేసుకొని, ఒక సెల్ఫీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు కింగ్ నాగార్జునపై ప్రశంసలు కురిపిస్తున్నారు. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం కుబేరలో నాగార్జున నటిస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్. కింగ్ నాగార్జున కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలోని పలు ప్రాంతాల్లో జరుపుకుంటుంది. ఇటీవల జూహు బీచ్లో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్పై సునీల్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలతో వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…