Nagarjuna : ఎప్పుడు ఎంతో సంతోషంగా సరదాగా ఉండే సమంత ఇటీవల చాలా బాధలు ఎదుర్కొంటుంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత పడ్డ బాధలు అన్ని మనం చూశాం. ఇక తాజాగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ప్రముఖ కథానాయిక సమంత తెలపడం చిత్రపరిశ్రమను షాక్ కు గురిచేసింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు అందరూ ట్విటర్ వేదికగా సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా, ఆత్మస్థైర్యాన్ని కల్పించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అయితే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఎవరైన సమంత గురించి స్పందిస్తారా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో అఖిల్తో పాటు సుశాంత్ తమ సోషల్ మీడియా పేజ్లో త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఆ వ్యాధిని ఎదుర్కొని మన ముందుకు వస్తుందంటూ ట్వీట్ చేశారు.ఇక నాగార్జున కూడా స్పందించారని తెలుస్తుండగా, ఆయన సమంతకు పర్సనల్గా మెసేజ్ పెట్టారని ఇన్సైడ్ టాక్. నాగ చైతన్య ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్న నేపథ్యంలో స్పందించలేదని టాక్.
ఇక సమంత అనారోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. సామ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు ఎదురవుతుంటాయని, మనలోని అంతర్గత శక్తి ఏంటో తెలుసుకోడానికి ఆ సవాళ్లు ఎదురవుతాయన్నారు. సమంత ఒక అద్భుతమైన అమ్మాయని, అంతర్గతంగా ఎంతో ధైర్యంగా ఉంటుందన్నారు. సమంత అతి త్వరలోనే అనారోగ్య సమస్య నుంచి బయపడుతుందని అనుకుంటున్నానని, సమంత ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో పేర్కొన్నారు.త్వరగా కోలుకోవాలి.. మీకు ఆ ధైర్యాన్ని పంపుతున్నా’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జనతా గ్యారేజ్, రామయ్య వస్తావయ్యా, బృందావనం, రభస లాంటి పలు చిత్రాల్లో సమంత జూనియర్ కు కథానాయికగా నటించింది. ఇక నాని కూడా ట్వీట్ చేస్తూ… మీరు ఎప్పటిలాగే బలంగా తిరిగి పుంజుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోరు అని రాసుకొచ్చారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…
జగన్ పాలనపై ఇప్పటికీ విమర్శల వర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు అయితే జగన్ బాగోతాలని ఒక్కొక్కటిగా…
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు నిర్ణయాలు తీసుకోవడమే కాక వాటిని అమలు చేస్తూ వస్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. అయితే అంతకముందు ఎన్టీఆర్ నటించిన…
Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు ఈ విషయం…